సామాజిక దొంగలు
హలో.. మీ పేరు రామారావండి.. అవును సర్ చెప్పండి.. ఒక బహుళ జాతి కంపేనీ వారు ఇటీవల తీసిన లాటరీలో మీ ఫోన్ నెంబరుకు కారు వచ్చిందండి. మీ బహుమతి కోసం దాని ధరలో 10 శాతం పన్ను చెల్లించాలి. ఫలానా నెంబరుకు ఫోన్ చేయండని చెప్తారు. అత్యాశతో మీరు వారి బ్యాంకు ఖాతాలో నగదు వేస్తే తర్వాత రోజు నుంచి ఆ ఫోన్ పని చేయదు. ప్రస్తుతం కొనసాగుతున్న సైబర్ నేరగాళ్ల అక్రమాలకు ఇదో చక్కని ఉదాహరణ.
సందేశాలు, లింకులు క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ
పెరుగుతున్న సైబర్ నేరాలు
జిల్లాలో ఈ ఏడాది 40కిపైగా ఘటనలు
కృష్ణా జిల్లాలో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆన్లైన్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వారిలో కొందరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇంత వరకూ పోలీసులకు ఫిర్యాదులు అందిన నేరాలను పరిశీలిస్తే.. సామాజిక మాధ్యమాల నేరాలు 11, వర్కు ఫ్రమ్ హోమ్ 2, లోన్ యాప్ల ద్వారా 6, ఓటీపీ పేరుతో 11, ఓఎల్ఎక్స్ 1తోపాటు మరో 10 ఆన్లైన్ మోసాలు నమోదయ్యాయి. కేసులు నమోదు కానివి చాలా ఉన్నాయి.
ఉపాధి, షాపింగ్ పేరుతో..
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న గుడివాడ మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన కె.మణి కుమార్ ఆన్లైన్లో ఉద్యోగాలను వెతకగా.. ఓ ఎయర్లైన్స్ కంపెనీ పేరుతో అతనికి కాల్ లెటర్ వచ్చింది. అందులో ఆకర్షణీయమైన జీతం ఉంది. సెక్యూరిటీ కింద కొంత నగదు జమ చేయాలని కోరగా వెంటనే అతడు తన తండ్రి ఖాతా నుంచి రూ.94,250 నగదు బదిలీ చేశాడు. అయితే అందులో రూ.42 వేలు మాత్రమే నేరస్థుడు బదిలీ చేసుకొని రెండో విడతలో విఫలమయ్యాడు. దీనిపై గుడివాడ తాలూకా పోలీసులు కేసు నమోదుచేశారు.
* గుడివాడ పట్టణం సత్యనారాయణపురంలో ఓ.లహరి అనే యువతి కూడా ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ చరవాణికి వచ్చిన ఓ లింక్ను నొక్కింది.. అంతే గతంలో తను వస్తువులు కొనడానికి వాడిన తన తండ్రి బ్యాంకు ఖాతాలోని రూ.50 వేలను నేరగాళ్లు నొక్కేశారు. ఆమె టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది.
అవగాహనతోనే అడ్డుకట్ట
అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్లు, లింక్లను తెరవొద్ధు వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పొందుపరచ రాదు. లాటరీలు పచ్చి మోసం. బహుమతుల కోసం ఆశపడి వాటికోసం పన్ను పేరుతో రూ.వేలల్లో చెల్లించొద్ధు అపరిచితులకు మీ బ్యాంకు పిన్, ఓటీపీ ఇవ్వొద్ధు మ్యాట్రిమనీ వెబ్ సైట్ల ద్వారా నకిలీ ఫొటోలతో మన వివరాలు సేకరించి మోసం చేస్తారు. అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో రుణం అందించే అన్ని కంపెనీలకు ఆర్బీఐ అనుమతి ఉండదు. అందువల్లే లోన్ యాప్లకు దూరంగా ఉండాలి.
- పి.జాషువా, ఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు