పేరుకే పెద్దాస్పత్రి
మత్తుపదార్థాలకు బానిసలు అయినవారికి కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆసుపత్రిలో మత్తు విమోచన కేంద్రాన్ని 2019లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇప్పటివరకు 2,318 మందికి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు....
వసతులు లేవు.. అవసరమైన సిబ్బందీ లేరు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
మత్తుపదార్థాలకు బానిసలు అయినవారికి కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆసుపత్రిలో మత్తు విమోచన కేంద్రాన్ని 2019లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇప్పటివరకు 2,318 మందికి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు 214మందిని పొగాకు వ్యసనం నుంచి పూర్తిగా విముక్తులను చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ సేవలు పొందిన రోగులపై కూడా సరైన పర్యవేక్షణ ఉండటం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులే తమ పరిశీలనలో గుర్తించడం గమనార్హం. రోగులకు ప్రత్యేకమైన భోజనం అందించాల్సి ఉన్నా ఆ దిశగా కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విభాగంలో సేవలు పొందేవారి కోసం మెడికల్ వార్డులో ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేశారు. వీటిని కేవలం వారికోసమే వినియోగించాలని ఉన్నతాధికారులు చెప్పినా ఇప్పటికీ సాధారణ రోగులకు కూడా ఆ విభాగంలో పడకలు కేటాయించి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక వైద్యురాలు, పలువురు సిబ్బంది ఉన్నా ఇంకా అదనపు సిబ్బంది అవసరం ఉందని ఇప్పటికే నివేదించినా ఆదిశగా ఎలాంటి చర్యలు లేవు. కేవలం ఈవిభాగానికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తుంటారు. వాటిని సరిగా వినియోగించుకుంటున్న దాఖలాలు లేవు.
ఆసుపత్రిలో ఎఫ్ఎన్వోలు, ఎంఎన్వోలు ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఉన్నవారిపై పనిభారం పడుతుండగా రోగులకు అందించే సేవలపై కూడా ప్రభావం చూపుతోంది. ఉన్న వాళ్లను సరు.బాటు చేసి సేవలు అందించాలని అధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఆదిశగా సాగడం లేదు. అన్ని విభాగాల్లో సిబ్బందిలేకుండా ఎలా సేవలు అందించగలమని పలువురు నేరుగా రికార్డులతో వచ్చి ఆర్ఎంవో ప్రశ్నించిన సంఘటనలు సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి.
మత్తువిమోచన విభాగంలో సేవలు పొందుతున్న సాధారణ రోగులు
హోమియో, ఆయుర్వేద విభాగాలూ అంతే
జిల్లా ఆసుపత్రిలో హోమియో వైద్యానికి 10బెడ్లు, ఆయుర్వేద విభాగానికి 10బెడ్లు చొప్పున కేటాయించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన పరికరాలు కూడా కేటాయించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రోగులు ఇక్కడ చేరి సేవలు పొందే వారు. ప్రస్తుతం ఈ విభాగాలు మూతపడ్డాయి. కేవలం సేవలు కేవలం ఓపీ వరకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో ఆ విభాగాలకు కేటాయించిన పరికరాలు అన్నీ మూలన పడేయడంతో పాడైపోతున్నాయి.
సమస్యల పరిష్కారానికి కృషి
ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. మత్తువిమోచన కేంద్రంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టాం. ఆ విభాగానికి కేటాయించిన నిధులు వినియోగించుకోకపోవడంతో కొంత వెనక్కువెళ్లిపోయాయి. అలాంటివి పునరావృతం కాకుండా అవసరమైన సేవలు అందించేందుకు కృషిచేస్తాం.
- డా.కృష్ణదొర, ఆర్ఎంవో జిల్లా ఆసుపత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లకు అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో