ముందే కొలువుల కూత
ఇంజినీరింగ్ విద్యార్థులు తక్కువ కాలంలో ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఇక రానుంది. రెండో ఏడాది పూర్తవగానే ప్రాంగణ ఎంపికలు నిర్వహించి కొలువులు అందించేలా బహుళజాతి సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సు పద్ధతి) ద్వారా ఈ ప్రక్రియలు నిర్వహించనున్నాయి.
4వ సెమిస్టర్ పూర్తవగానే ప్రాంగణ ఎంపికలు
ఇంజినీరింగ్ విద్యార్థులు తక్కువ కాలంలో ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఇక రానుంది. రెండో ఏడాది పూర్తవగానే ప్రాంగణ ఎంపికలు నిర్వహించి కొలువులు అందించేలా బహుళజాతి సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సు పద్ధతి) ద్వారా ఈ ప్రక్రియలు నిర్వహించనున్నాయి. గతంలో మూడో సంవత్సరం పూర్తవగానే 7, 8 సెమిస్టర్లలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించేవారు. రానున్న రోజుల్లో 5వ సెమిస్టర్లోనే జరగనున్న నేపథ్యంలో సాంకేతిక విద్యార్థులు అందుకు తగ్గట్టుగా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
బహుళజాతి సంస్థలు ఈ తరహా ఎంపికలను అవగాహన ఒప్పందం చేసుకున్న కళాశాలల్లో చేపడుతున్నాయి. ఒప్పందంలో భాగంగా కళాశాలల విద్యార్థులకు తమ సంస్థకు కావాల్సిన అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని చదువుకునే సమయంలోనే అందించి.. 4 సంవత్సరం పూర్తవగానే నేరుగా సంస్థలో పనిచేసేలా శిక్షణ ఇస్తున్నారు.
* సీవోఈలో ఎంపికైన విద్యార్థులకు వార్షికవేతనం రూ.50 వేలు వరకు అదనంగా ఉంటుంది. ● కళాశాలలు బహుళజాతి సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం వల్ల కొత్త టెక్నాలజీలపై అటు అధ్యాపకులకు, విద్యార్థులకు పట్టు పెరుగుతుంది.
ప్రస్తుత ప్రక్రియ ఇలా.. రెండో ఏడాది పూర్తవగానే విద్యార్థులకు సీవోఈ విధానంలో ఎంపికలు నిర్వహిస్తారు. అంటే 5వ సెమిస్టర్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎంపికైన విద్యార్థులకు 3వ ఏడాదిలోనే వారితో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్ పూర్తి చేయిస్తారు. అనంతరం 4వ ఏడాదిలోనే వారికి ఇంటర్న్షిప్ రూపంలో నెలకు రూ.20 వేలు నుంచి 40 వేలు వరకు చెల్లించి సంస్థల లైవ్ ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. తద్వారా బీటెక్ పూర్తవగానే వారిని సంస్థ శాశ్వత ఉద్యోగిగా నియమించుకుని వార్షిక వేతనం రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు వరకు ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం వర్యూసా, హెక్సావేర్, సీటీఎస్, విప్రో, ఈప్యాన్, హెచ్సీఎల్, వంటి సంస్థలు ఇప్పుడు జిల్లాలోని కొన్ని కళాశాలల్లో ఈ తరహా ప్రాంగణ ఎంపికలు ప్రారంభించాయి.
టెక్నాలజీకి అనుసంధానంగా అభ్యసనం
రెండో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికలు మొదలవడం వల్ల విద్యార్థులు టెక్నాలజీని అనుసంధానం చేసుకుని చదవాల్సిన అవసరం ఉంటుంది. వార్షిక వేతనం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కొత్త టెక్నాలజీలైన ఏఐఎంఎల్, పెగా వంటి వాటిపై పనిచేసే అవకాశం కలుగుతుంది. జిల్లాలో ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యింది.
- ఎన్వీ సురేంద్రబాబు, ఏపీటీపీవో సంఘం ప్రధాన కార్యదర్శి
చదువు పూర్తయ్యేలోగా ఉద్యోగం
5వ సెమిస్టర్లోనే విద్యార్థితో సర్టిఫికేషన్ పూర్తి చేయించడం వల్ల చదువు పూర్తయ్యే లోగా అతడు నైపుణ్యం పెంచుకుంటాడు. కళాశాలలో ఉన్న అధునాతన ప్రయోగ శాలలను మరింత అభివృద్ధి చేసుకోవచ్ఛు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను వారికి అందించే అవకాశం ఉంటుంది. వారికి నాల్గో ఏడాది నుంచే ఇంటర్న్షిప్ రూపంలో కొలువు సంపాదించే అవకాశం ఉంటుంది.
- కె.సాయిరోహిత్, ఎండీ, రామచంద్రా కళాశాల
శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం
నైపుణ్యం, శిక్షణ ఉన్న కొత్త విద్యార్థులకు సంస్థలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కళాశాలలో ఎంపిక చేసిన తరువాత వారికి శిక్షణకు ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు ఇంజినిరింగ్ చదువుతన్న సమయంలోనే సంస్థల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది.
- టెక్ మహీంద్ర హెచ్ఆర్ ప్రతినిధి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్