జగనన్న కాలనీలో... రూ.లక్షకే సెంటు స్థలం
అతను దినసరి కూలీ. ఆయనకు జగనన్న కాలనీలో సెంటు ఇంటి స్థలం వచ్చింది. ఇంతవరకు ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందని ఎదురు చూశారు. నిర్మాణం ప్రారంభించకపోతే పట్టా రద్దు చేసి స్థలం వెనక్కి తీసుకుంటామంటూ.. వాలంటీరు నుంచి...
ఈనాడు, అమరావతి
అతను దినసరి కూలీ. ఆయనకు జగనన్న కాలనీలో సెంటు ఇంటి స్థలం వచ్చింది. ఇంతవరకు ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందని ఎదురు చూశారు. నిర్మాణం ప్రారంభించకపోతే పట్టా రద్దు చేసి స్థలం వెనక్కి తీసుకుంటామంటూ.. వాలంటీరు నుంచి అధికారుల వరకు హెచ్చరికలు చేస్తున్నారు. వారుఉండే ప్రాంతం నుంచి ఆ లేఔట్కు వెళ్లేందుకే దారి ఖర్చులు లేని ఆ కుటుంబం ఇంటి నిర్మాణం చేయలేమని స్థలాన్ని బేరానికి పెట్టారు. మధ్యవర్తితో రూ.1.50లక్షలకు వేరే వ్యక్తులు కొనుగోలు చేశారు. ఆ ఇంటికి వచ్చే రూ.1.80లక్షల రాయితీ కొనుగోలు చేసిన వ్యక్తి తీసుకునేటట్లు ఒప్పందం. విజయవాడ గ్రామీణ మండలం నున్న లేఔట్లో జరిగిన సంఘటన.
నున్న కాలనీలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు
జగనన్న కాలనీలో నివేశన స్థలాలు క్రయ విక్రయాలు జరుగుతున్న విషయం అధికారుల దృష్టికి రావడంతో హెచ్చరికలు చేస్తూ బోర్డులు సైతం కాలనీలో ఏర్పాటు చేశారు. ఇలా స్థలాలు ఎవరైనా విక్రయిస్తే.. స్థలం రద్దు చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.
జగనన్న కాలనీల్లో వందల సంఖ్యలో స్థలాలు విక్రయించారు. కాలనీలే పూర్తి కాలేదు. మౌలిక వసతులు లేవు. విద్యుత్తు సౌకర్యం లేదు. మంచినీరు, రవాణా(రోడ్డు) లాంటి వసతులు రానేలేదు. జగనన్న కాలనీలో అమ్మకానికి ప్లాట్లు అంటూ.. స్థిరాస్తి వ్యాపారులు వాలిపోతున్నారు. ఇళ్లు కట్టుకోలేని నిరుపేదలు.. ఇంతకు ముందే స్థలం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ప్లాట్లు అమ్మేస్తున్నారు. కేవలం నోటరీ ద్వారా ఒప్పంద పత్రాలు రాసుకుంటున్నారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని 9 గ్రామాల పేదల కోసం నున్న సమీపంలో లేఔట్ వేశారు. ఇక్కడ మొత్తం రెండు లేఔట్లలో 5,250 వరకు నివేశన స్థలాలు ఇచ్చారు. ప్రైవేటు భూమి సేకరించి జగనన్న లేఔట్ వేశారు. 73.35 ఎకరాల్లో మొత్తం 4,149 మందికి సెంటు చొప్పున పట్టాలు జారీ చేశారు. ఇక్కడ ఎకరం ప్రైవేటు భూమి రూ.60లక్షలు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరో లేఔట్లలో 20.4 ఎకరాల్లో 1105 మందికి స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఎకరం రూ.35లక్షల చొప్పున సేకరించింది. స్థోమత ఉన్నవారు ఇంటికి రూ.5లక్షల నుంచి రూ.9లక్షల వరకు వ్యయం చేసి ఇంటిని నిర్మించుకున్నారు స్థోమత లేని పేదలు, గతంలోనే ఇళ్లు ఉన్న వ్యక్తులు బేరాలు పెట్టారు. సహజంగా ఏజెంట్లు పుట్టుకొచ్చారు. విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. సెంటు స్థలం రూ.1.50లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. పక్కపక్కనే ఉన్న స్థలాలు కలిపి కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. విజయవాడ అర్బన్ పరిధిలో పేదలకు పెనమలూరు మండలం వణుకూరులో స్థలాలు కేటాయించారు. అధికారులు ఎంత వత్తిడి తెచ్చినా ఇక్కడి నుంచి వెళ్లి నిర్మాణం చేసుకోవడం కష్టమైపోతోందని వాపోతున్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పేదలకు కేటాయించారు. దాదాపు 4వేల మందికి కొండను తొలిసి లేఅవుట్ వేశారు. అక్కడికి వెళ్లేందుకే రోజుకు రూ.200 ఖర్చు అవుతున్నాయని అక్కడ ఒక్క నిర్మాణం ప్రారంభం కాలేదు. వాటిని ముందే బేరాలకు పెడుతున్నారు.
విజయవాడ అర్బన్ ప్రాంత వాసులకు వెలగలేరు వద్ద దాదాపు 6వేల మందికి లేఔట్ వేశారు. ఇక్కడికి వెళ్లి ఇళ్లు నిర్మాణం చేసుకోలేమంటూ.. అమ్మకానికి పెడుతున్నారు. పల్లవాని తిప్ప లేఅవుట్లలో ఇదే పరిస్థితి ఉంది. కొండపల్లి లేఅవుట్లో 1516 మందికి పట్టాలు ఇచ్చారు. ఇక్కడ రూ.1.50లక్షల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రూ.10స్టాంపు పత్రంపై ఒప్పందం రాసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పటికే 30 వరకు అమ్మకాలు జరిగాయి. ఇబ్రహీంపట్నంలో 1602 మందికి లేఅవుట్ వేశారు. ఇది సమీపంలో ఉండటంతో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు విక్రయిస్తున్నారు. 25 ప్లాట్లు వరకు విక్రయాలు జరిగినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
[ 24-04-2024]
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అంటకాగితే.. అంతే రాణా..!
[ 24-04-2024]
అధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!