టెర్మినల్ పనుల్లో జాప్యం వాస్తవమే : ఎంపీ
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న శాశ్వత ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని విమానాశ్రయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ బాలశౌరి అన్నారు.
- మనోహరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి
అధికారులతో చర్చిస్తున్న బాలశౌరి, పక్కన ఏపీడీ రామారావు తదితరులు
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న శాశ్వత ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని విమానాశ్రయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ బాలశౌరి అన్నారు. విమానాశ్రయం ఆవరణలో కొనసాగుతున్న పనులను డైరెక్టర్ పీవీ రామారావుతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ నుంచి ఉపశమనం అనంతరం కూడా పనులు నత్తనడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమస్యను కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రస్తుతం 80శాతం పూర్తవ్వాల్సిన పనులు కేవలం 22శాతమే పూర్తయ్యాయన్నారు. సుమారు రూ.500కోట్లతో చేపట్టే టెర్మినల్ భవనం అందుబాటులోకి వస్తే దేశీయ, విదేశీ సేవలను ఒకే వేదికగా అందించేందుకు.. విమాన సర్వీసుల పెరుగుదలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. రానున్న జూన్, జులై నాటికి పూర్తిస్థాయిలో భవనాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారన్న ఎంపీ.. సమస్యను కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని పేర్కొన్నారు.
పనుల పురోగతికి ప్రణాళికలు
విదేశీ, స్వదేశీ సేవలు ప్రస్తుతం వేర్వేరు భవనాల్లో కొనసాగుతున్నాయి. నూతనంగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ భవనంతో ఆ రెండు సేవలు ఒకే భవనంలో ప్రయాణికులకు అందనున్నాయి. ఈ నేపథ్యంలో రూ.కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల పురోగతికి నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బాలశౌరి తెలిపారు. 14 ఇమ్మిగ్రేషన్, 4క్లస్టమ్స్ కౌంటర్లు, 24 చెక్ఇన్ పాయింట్లు, రాకపోక మార్గాల్లో బ్యాగేజీ కన్వేయర్లు, అంతర్జాతీయ స్థాయి బ్యాగేజీ వ్యాండ్లింగ్ వ్యవస్థతో కూడిన నూతన టెర్మినల్ నిర్మాణాన్ని ఎన్నిరోజుల్లో పూర్తిచేయగలమనే దానిపై ప్రణాళికలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం..
విమానాశ్రయంలో విమాన సర్వీసుల పెంపుదలపై దృష్టి సారించనున్నట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం దిల్లీ నుంచి ఎయిర్ ఇండియాతో పాటు అదనంగా మరో సర్వీసు, వారణాసికి నూతన, బాంబే సర్వీసు పునరుద్ధరణ, నేరుగా విదేశాలకు నడిచే మస్కట్తో పాటు సింగపూర్ సర్వీసు పునరుద్ధరణ, దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాలకు నేరుగా ప్రత్యేక సర్వీసులు నడిచే అంశంపై కేంద్రంలోని పెద్దలతో సంప్రదింపులు జరపనున్నట్లు ఎంపీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్