నడిరోడ్డుపై యువకుల హల్చల్
నడిరోడ్డుపై యువకులు వీరంగం సృష్టించిన సంఘటన చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై గన్నవరం వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఏటా శ్రావణమాసంలోని రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని పాతగన్నవరంలో కొలువైన శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి వార్షిక సంబరాల్లో భాగంగా పట్టణంలోని
మద్యం మత్తులో వీరంగం
డప్పు కళాకారులతో వివాదం
చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపైకి దూసుకొచ్చిన యువకులు
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: నడిరోడ్డుపై యువకులు వీరంగం సృష్టించిన సంఘటన చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై గన్నవరం వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఏటా శ్రావణమాసంలోని రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని పాతగన్నవరంలో కొలువైన శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి వార్షిక సంబరాల్లో భాగంగా పట్టణంలోని వివిధ కులాలు, ప్రాంతాలకు చెందిన సంఘాలు విడివిడిగా ప్రభలు ఏర్పాటుచేసి ఆలయానికి మేళతాళాలతో ప్రదర్శనగా తరలివస్తాయి. ఈ క్రమంలో శుక్రవారం ప్రభలు చెన్నై-కోల్కతా జాతీయ రహదారి మీదుగా ప్రదర్శనగా వస్తున్న తరుణంలో చెంచులపేటకు చెందిన యువ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రభ ముందు డప్పు వాయిస్తున్న ఓ కళాకారుడు స్థానిక గౌడపేటకు చెందిన పటమట మహేష్ అనే యువకుడు అడ్డుగా వచ్చాడంటూ అతని తలపై చేతిలోని డప్పు, వాయిద్య కర్రతో బాదాడు. దీంతో యువకుడి తలకు స్వల్ప గాయమవ్వగా అప్రమత్తమైన యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి డప్పుకళాకారులపైకి దూసుకొచ్చారు. ఒక్కసారిగా వందమందికి పైగా యువకులు హైవే పైకి దూసుకురావడంతో అసలేం జరిగిందో స్థానికులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆవేశంతో ఊగిపోయిన యువకులు డప్పు కళాకారుల చేతిలోని వాయిద్య పరికరాలను ధ్వంసం చేశారు. తొలుత గాంధీబొమ్మ కూడలి సమీపంలో మొదలైన వివాదం ప్రదర్శన జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు ప్రభలు చేరుకొనేవరకు సాగింది. యువకుల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన డప్పువాయిద్య కళాకారుల్లో కొందరు పారిపోగా.. మిగిలిన ఇద్దరు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో తలదాచుకున్నారు. దీంతో డప్పుకళాకారులను తమకు అప్పగించాల్సిందే అంటూ యువకుడు మహేష్ సామాజిక వర్గంవారు హైవేపై ఆందోళన చేపట్టారు. ఘటనపై ముందు యార్లగడ్డ, ఎమ్మెల్యే వంశీ వర్గీయుల మధ్య వివాదం అంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. తర్వాత పూర్తి విషయం తెలుసుకోవడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఎట్టకేలకు సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్, రమేష్ బృందం ఇరువర్గాలను అదుపులోకి తీసుకొని వివాదం సద్దుమణిగేలా చర్యలు చేపట్టారు.
పోలీసుల వైఫల్యంతోనే..
సుమారు పది ప్రభలు స్థానిక జాతీయ రహదారి మీదుగా తరలివెళ్తున్న సమయంలో పోలీసులు కనీసం ట్రాఫిక్ చర్యలు చేపట్టకోవడంతో పాటు యువకులను అదుపు చేయలేకపోవడం గమనార్హం. ముందస్తుగా ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టక పోవడంతోనే యువకులు ఒక్కసారిగా వందమందికి పైగా జాతీయ రహదారిపైకి దూసుకొచ్చారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన కొంత సమయానికే అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దామని సీఐ శివాజి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
రాజీనామా చేయకుంటే.. ఊరుకోం..!
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.