Vijayawada News : చెత్తపన్ను తెస్తేనే జీతం..!
‘విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మేస్త్రీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, వార్డు హెల్త్ సెక్రటరీలు, వార్డు శానిటరీ సెక్రటరీలు, అడ్మిన్లు అందరూ డివిజన్లలో యూజర్ ఛార్జీలు(చెత్తపన్ను) చెల్లించిన
సిబ్బందికి వీఎంసీ అధికారుల నోటీసులు
ఈనాడు, అమరావతి
‘చెత్త పన్ను చెల్లించేందుకు కొంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని నేను, పేర్ని నాని సీఎం దృష్టికి తీసుకెళ్లాం..! చెత్త పన్ను మున్సిపాలిటీకి కూడా పెద్ద ఆదాయం కాదు..!’
- ఇటీవల గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని చెప్పిన మాటలు ఇవి.
వాస్తవానికి గడపగడపకు కార్యక్రమంలో ఆయన దృష్టికి ప్రజలు చెత్త పన్ను విషయాన్ని తీసుకురాగా.. వసూలు చేయవద్దంటే ఎందుకు చేస్తున్నారంటూ కమిషనర్ను ప్రశ్నించారు. అనంతరం మరో మాజీ మంత్రికి ఫోన్ చేసి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళదామంటూ చెప్పారు.
‘విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మేస్త్రీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, వార్డు హెల్త్ సెక్రటరీలు, వార్డు శానిటరీ సెక్రటరీలు, అడ్మిన్లు అందరూ డివిజన్లలో యూజర్ ఛార్జీలు(చెత్తపన్ను) చెల్లించిన రశీదులు పొందని పక్షంలో ఆగస్టు నెల వేతనం చెల్లించబోమంటూ వీఎంసీ ప్రజారోగ్య శాఖ ప్రధాన వైద్యాధికారి నోటీసు జారీచేశారు.
చెత్తపన్ను చెల్లించమంటే ప్రజలకు కోపం... జమ చేయలేదంటే అధికారులకు కోపం.. ఆడకత్తెరలో పోక చెక్కలా తయారైంది ఉద్యోగుల పరిస్థితి. పలు పురాల్లో ప్రజాప్రతినిధులే అనధికారికంగా చెత్తపన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ సెలవిస్తున్నారు. విజయవాడలో చెత్తపన్ను పేరుతో ప్రజలనుంచి ఇప్పటికే రూ.3కోట్లవరకు ముక్కుపిండి వసూలు చేశారు. రోడ్డు పక్కన తినుబండారు అమ్ముకునే బడ్డీవ్యాపారుల నుంచి వాణిజ్యం కేటగిరి కింద భారీగా వసూలు చేస్తున్నారు. కానీ గృహయజమానులకు, ఇతర వర్తకులకు చెత్త పన్ను చెల్లించాలని డిమాండ్ నోటీసు మాత్రం ఇవ్వలేదు. విజయవాడలో నెలకు రూ.4 కోట్ల వరకు చెత్తపన్ను డిమాండ్ ఉంది. గత ఏడాది ఆక్టోబరు నుంచి వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎవరూ చెత్తపన్ను చెల్లించడం లేదు. స్వయంగా వైకాపా కార్పొరేటర్లు చెత్తపన్ను చెల్లించవద్దని సూచిస్తున్నారు. ఇటీవల ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు యూజర్ ఛార్జీలపై నిరసన తెగ తగిలింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను పశ్చిమ నియోజకవర్గంలో ఒక యువకుడు ప్రశ్నిస్తే.. అతనిపై కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
* తిరువూరు మున్సిపాలిటీలో 8,18 డివిజన్లలో కేవలం రెండు వార్డుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తే డిమాండ్ రూ.4.90లక్షలు వచ్చింది. వసూలు రూ.2.30లక్షలు వసూలు అయింది. తాడిగప పరిధిలో యనమలకుదురులో అసలు వసూలు చేయడం లేదు. కానూరు, పోరంకి మాత్రమే వసూలు చేస్తున్నారు. పెడనలో పూర్తిగా నిలిపివేశారు.
* యూజర్ ఛార్జీలు వసూలు చేయడం చట్టవ్యతిరేకమని ఏపీ పట్టణ పౌరసమాఖ్య కన్వీనర్ చిగురుపాటి బాబూరావు మండిపడ్డారు. ఆస్తిపన్నులోనే చెత్తసేకరణకు కలిపి పట్టణవాసులు పన్నులు చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. నోటీసులు ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
* వీఎంసీ పరిధిలో చెత్త పన్ను ఒక్క పోర్షన్కు రూ.120 చొప్పున విధిస్తున్నారు. ఒక ఇంటిలో ఎన్ని పోర్షన్లు ఉంటే.. అంత చెల్లించాల్సిందే. అద్దెకు ఇవ్వకుండా ఖాళీగా ఉన్నా సరే తప్పదు.
* మురికివాడల్లో పోర్షన్కు రూ.60 వసూలు చేస్తున్నారు. దీనికి కొన్ని ప్రాంతాల్లో బుట్టలు సరఫరా చేశారు. కొన్ని డివిజన్లలో బుట్టలు ఇవ్వలేదు.
* పట్టణాల్లో కొన్ని చెత్త వాహనాలు మూలన పడ్డాయి. గృహ యజమానులు చెత్తను తీసుకెళ్లి వీధుల్లోని చెత్త కుండీల్లోనే వేస్తున్నారు. నందిగామ, తిరువూరు, తాడిగడప, ఉయ్యూరు, పెడన, కొండపల్లి లాంటి పట్టణాల్లో ఇంకా ఇదే పద్దతి అమలులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM