కాసులు కురిపిస్తున్న నిషేధిత భూములు..!
అవి నిషేధిత జాబితాలో ఉన్న భూములు. కానీ అప్పటికే వాటిలో క్రయ విక్రయాలు జరిగాయి. ఎకరం రూ.20కోట్లు వరకు మార్కెట్ విలువ ఉన్నవి వదులుకుంటారా..? అందరూ సిండికేట్గా మారారు. భారీగా ఖర్చు చేశారు. అంతే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ..
అవి నిషేధిత జాబితాలో ఉన్న భూములు. కానీ అప్పటికే వాటిలో క్రయ విక్రయాలు జరిగాయి. ఎకరం రూ.20కోట్లు వరకు మార్కెట్ విలువ ఉన్నవి వదులుకుంటారా..? అందరూ సిండికేట్గా మారారు. భారీగా ఖర్చు చేశారు. అంతే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రెవెన్యూ వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది.
కానూరు, పోరంకి సర్వేనెంబర్ల పరిధిలో 23.79 ఎకరాలు బ్రిటిష్ సంస్థానంలో పనిచేసిన వ్యక్తులకు ఉదారంగా అప్పట్లో బహుమతిగా ఇచ్చారు. దీనికి గిప్టుడీడ్లు పురాతన కాలం నాటివి. వీటితో లావాదేవీలు జరిగాయి. వీటిని గమనించిన ఓ రెవెన్యూ అధికారి కన్నేసి అడిగినంత ఇవ్వలేదన్న కారణమో.. ఇతర కారణాలో కానీ 2016లో వీటిని నిషేధిత(22ఏ) జాబితాలో చేర్చారు. అప్పటికే వెంచర్లు వేసి క్రయవిక్రయాలు జరిగాయి. మొత్తానికి రూ.లక్షల్లో ఖర్చు చేసి పైరవీలు చేసి నిషేధం తొలగించారు. ఇప్పుడు ఇక్కడ గజం రూ.50వేల నుంచి 75వేలు ధర పలుకుతోంది.
ఈనాడు, అమరావతి
రాష్ట్ర ప్రభుత్వం నిషేధ భూములపై ప్రకటన చేయడంతో మండలాల్లో పైరవీలు ప్రారంభమయ్యాయి. కొంతమంది నేతలు ఈ వివాదస్పద భూములపై దృష్టిపెట్టారు. భూమి విస్తీర్ణం, మార్కెట్ విలువను బట్టి కమిషన్లు మాట్లాడుతున్నారు. సాధారణంగా పట్టాలకే రెవెన్యూ అధికారులకు మామూళ్లు సమర్పించుకునే రైతులు, ప్రస్తుతం నిషేధిత జాబితా భూముల పరిష్కారం అంటే.. మూటలు సమర్పించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
పైలట్ ప్రాజెక్టు ఏమైంది...?
‘ముందుగా రెండు మండలాలు ఎంపిక చేసి పరిష్కారం కనుగొంటాం. దస్త్రాలు అన్నీ సవ్యంగా ఉంటే చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పిస్తాం. ఏపరిస్థితుల్లో చుక్కలు పెట్టారో..? నిషేధిత జాబితాలో చేర్చారో విచారణ జరిపిస్తాం..!’ అని నాటి సంయక్త కలెక్టర్ కె.మాధవీలత వెల్లడించారు. నాగాయలంక, కోడూరు పైలట్ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అంతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. నాగాయలంక మండలంలో మొత్తం 28235 ఎకరాలు ఉంటే.. 5,926 ఎకరాలు నిషేధిత జాబితాలోనే చేర్చారు. ఈమండలంలో చోడవరం గ్రామంలో 95.56 ఎకరాలు ఉంది. వీటి దస్త్రాలను పరిశీలించారు. కానీ ఇంతవరకు ఫలితం బయటకు రాలేదు. బందరు డివిజనులో చుక్కల భూములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 1411 ఫిర్యాదులు అందింతే కేవలం 77 మాత్రమే అనుమతించారు. 912 దరఖాస్తులను తిరస్కరించారు. జిల్లాల విభజనతో మళ్లీ ఇవి తెరమీదకు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో 22ఏ భూముల విషయంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. గత నెలలో వారం రోజులుపాటు దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో కలెక్టర్ నేతృత్వంలో 25 సమస్యలకు పరిష్కారం లభించింది. ఈ ఒక్క జిల్లాలోనే అత్యధికంగా 1473 దరఖాస్తులు అందాయి. ఎక్కువగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తులే. .
* ఇబ్రహీంపట్నం పరిధిలో 22 దరఖాస్తులు అందితే వాటిలో 16 దేవాదాయ శాఖకు చెందిన భూములు తమవిగా దరఖాస్తులు అందించారు. పాత దస్త్రాలు, సేల్డీడ్లు సృష్టించి దరఖాస్తులు చేశారు. వీటిని పరిష్కరించేందుకు కొంతమంది దళారులు రంగంలోకి దిగారు. దేవదాయ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
* బందరు మండలంలో షరతులతో కూడిన పట్టాలను గతంలో ఇచ్చారు. ప్రస్తుతం వాటిలో చేపలచెరువులు తయారయ్యాయి. వీటికి పట్టాలు ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకు రుణాలు రావడంలేదు. అధికార పార్టీ నాయకుడిని ఆశ్రయించి వీటికి పట్టాలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఎకరానికి భారీగా ముడపులు చేతులు మారుతున్నాయి.
* గుడివాడలో వేణుగోపాలస్వామి భూములకు రెవెన్యూ శాఖ ఇప్పటికే క్లియరెన్సు ఇచ్చింది. ఇక దేవదాయ శాఖ క్లియరెన్సు లభిస్తే.. రూ.200కోట్ల ఆస్తి పరుల పాలే.
* విజయవాడ నగరం గుణదల ప్రాంతంలో కొన్ని సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో చేర్చారు. ఎందుకు చేర్చారో ఎవరికి అంతుపట్టడం లేదు. వాటిని మార్చేందుకు ఓ ప్రజాప్రతినిధి లాబీయింగు చేస్తున్నారు.
* పశ్చిమ మండలం పరిధిలో ఓ నేతకు సంబంధించిన భూమి క్రమబద్దీకరణకు పైరవీలు చేస్తున్నారు. రికార్డుల పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఈ భూములు తన ఆధీనంలో ఉన్నాయి. ప్రైవేటు పట్టాగా దస్త్రాలను చూపిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పైరవీలు చేస్తున్నారు.
అన్నీ సవ్యంగా ఉంటేనే..!
నిషేధిత జాబితాలో ఉన్న భూములపై ప్రత్యేక దృష్టి సారించాం. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా అన్నీ దస్త్రాలు సక్రమంగా ఉండి, హక్కులు కలిగి ఉంటే పరిష్కరిస్తున్నాం. కొన్ని తహశీల్దారు పరిధిలో, మరికొన్ని రెవెన్యూ డివిజనల్ అధికారుల పరిధిలో, ఇంకొన్ని జిల్లా స్థాయిలో పరిష్కరిస్తున్నాం. వాస్తవంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలు ఉంటే తిరస్కరిస్తున్నాం. కొన్ని పొరపాటున సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలోకి వెళ్లి ఉండవచ్చు. దీనిలో పైరవీలకు ఆస్కారం లేదు. అలా ఎవరైనా ప్రవర్తించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- ఎస్ డిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!