రాబడిపై ఆర్టీసీ గంపెడాశలు
అసలే నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీ, ఆ లోటు పూడ్చుకునేందుకు రాబడిపై దృష్టి పెట్టింది. కేవలం ప్రయాణికుల చేరవేత ద్వారానే కాకుండా వాణిజ్యపరంగానూ ఆదాయం సమకూర్చుకునేలా మార్గాలు అన్వేషిస్తోంది. అందులో భాగంగా విజయవాడ పీఎన్బీఎస్లోని
ఖాళీ దుకాణాల వేలంపై దృష్టి
ఈనాడు - అమరావతి: అసలే నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీ, ఆ లోటు పూడ్చుకునేందుకు రాబడిపై దృష్టి పెట్టింది. కేవలం ప్రయాణికుల చేరవేత ద్వారానే కాకుండా వాణిజ్యపరంగానూ ఆదాయం సమకూర్చుకునేలా మార్గాలు అన్వేషిస్తోంది. అందులో భాగంగా విజయవాడ పీఎన్బీఎస్లోని ఖాళీ దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ-టెండర్లు పిలిచింది. ఈనెల 22వ తేదీతో గడువు ముగియనుంది. గతంలో పిలిచిన వాటికి పెద్దగా స్పందన కనిపించలేదు. ఈసారి ఈ-టెండర్లకు ఆర్టీసీ వెళ్లింది. ఈసారైనా స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు. రూ.50 లక్షల మేర ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు.
పెరిగిన రద్దీ
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడలిగా విజయవాడ ఎదిగింది. నగరం అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండడమే ఇందుకు కారణం. ఒకప్పుడు ఆసియాలోనే కీలకమైన బస్టాండుగా వెలుగొందిన బెజవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్.. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత కీలకంగా మారింది. ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు, తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి ఇక్కడికి సర్వీసులు నడుస్తున్నాయి. ఇసుక వేస్తే రాలనంత రద్దీగా ఉంటోంది. ఇక్కడికి నిత్యం దాదాపు 3,000 బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో 450 సర్వీసులు తిరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 1.50 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. ఇందులో సిటీ బస్ పోర్టు నుంచి దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తారు. రద్దీగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ఆదాయం కోసం వాణిజ్య దుకాణాలను నిర్మించారు. ఎరైవల్, డిపార్చర్ బ్లాక్లతో పాటు సిటీ టెర్మినల్లో 146 వరకు గదులు కట్టారు.
* ఏటీఎం కేంద్రాలు, హోటళ్లు, నిరీక్షణ గదులు, డార్మిటరీలు, చిరుతిళ్లు, శీతలపానీయాలు, ఇంటర్నెట్, సినిమా హాలు, టీ స్టాళ్లు, ఫ్యాన్సీ తదితరాలకు అద్దెకు ఇచ్చారు. విస్తీర్ణానికి అనుగుణంగా అద్దె నిర్ణయించారు. కనిష్ఠంగా రూ. 15 వేలు నుంచి గరిష్ఠంగా రూ. 6.5 లక్షల వరకు నెలవారీ అద్దె ఉంది. వాటన్నింటి ద్వారా దాదాపు రూ. 1.50 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. కరోనాతో పరిస్థితులు తల్లకిందులయ్యాయి. చాలా రోజులు లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ కారణంగా వ్యాపారాలు సాగక దుకాణాలు మూతపడ్డాయి. ప్రస్తుతం 30 షాపులు చాలా కాలం నుంచి ఖాళీగా ఉన్నాయి. మహమ్మారి ప్రభావం నామమాత్రంగా ఉండడం, జన జీవనం సాధారణ స్థితికి చేరడంతో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. వ్యాపారాలు పుంజుకోవడంతో ఖాళీ షాపులకు టెండర్లు పిలిచారు. గతంలో పలు దఫాలు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. రెండు సార్లు వ్యాపారులతో ఆర్టీసీ అధికారులు సమావేశాలు నిర్వహించారు. వారి నుంచి సలహాలు స్వీకరించి, ఆ మేరకు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్