త్వరలో సరకు రవాణా రైల్వే లైను
విజయవాడ కేంద్రంగా వస్తు రవాణా నిమిత్తం ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల మీదుగా మధ్యప్రదేశ్లోని ఇటార్సి వరకు ‘కొత్త ప్రత్యేక వస్తు రవాణా కారిడార్’ (న్యూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్) ఏర్పాటుపై రైల్వే శాఖ అధ్యయనం ప్రారంభించింది.
రైతులతో సమావేశాలు ప్రారంభం
చండ్రగూడెంలో వివరాలు సేకరిస్తున్న అధికారులు
న్యూస్టుడే, మైలవరం: విజయవాడ కేంద్రంగా వస్తు రవాణా నిమిత్తం ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల మీదుగా మధ్యప్రదేశ్లోని ఇటార్సి వరకు ‘కొత్త ప్రత్యేక వస్తు రవాణా కారిడార్’ (న్యూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్) ఏర్పాటుపై రైల్వే శాఖ అధ్యయనం ప్రారంభించింది. ఇప్పటికే ప్రాథమిక అలైన్మెంట్ పూర్తిచేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కోసం ఇంజినీరింగ్ కన్సల్టింగ్ సంస్థలకు అప్పగించింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా జిల్లాలో రైలు మార్గం వెళ్లే గ్రామాల్లోని రైతులతో రెవెన్యూ శాఖ సహకారంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగర సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషనుకు అనుసంధానిస్తూ గూడ్సు లైను ప్రతిపాదనకు తుదిరూపు ఇచ్చేందుకు ‘అర్వీ అసోసియేట్స్ కన్సల్టెంట్స్ ప్రైవేటు లిమిటెడ్.’ సంస్థ ఆధ్వర్యంలో కసరత్తులు వేగవంతమయ్యాయి. కొత్త కారిడార్గా రూపుదిద్దుకునే రైల్వేలైన్ను జిల్లాలోని విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లోని 28 గ్రామాల మీదుగా సాగేలా ప్రాథమిక అలైన్మెంట్ సిద్ధం చేశారు. దీనికి ఆమోదం తెలుపుతూ తుది మెరుగులు దిద్దేందుకు ‘డెెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ డీపీఆర్ బాధ్యతలను ఆర్వీ సంస్థకు అప్పగించగా, ప్రస్తుతం సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ రీసెర్చి సంస్థ సమావేశాలు జరుపుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని విజయవాడ రెవెన్యూ డివిజన్, తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, సంస్థ ప్రతినిధులు కలిసి భూములివ్వాల్సిన రైతులతో సమావేశాలు ప్రారంభించారు. కాగా ఆయా గ్రామాల్లో ఎక్కువమంది రైతులు ప్రాథమికంగా తమ భూములివ్వడానికి అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ వారంలోనే సమావేశాలు ముగించి డీపీఆర్కు తుది రూపునివ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రెండు చోట్ల హైవే క్రాసింగ్: ఇప్పటికే రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్ మేరకు రాయనపాడు నుంచి జి.కొండూరు బైపాస్నకు తూర్పుగా వెళ్లే మార్గం, అదే మండలం కుంటముక్కల వద్ద జాతీయ రహదారి 30ను క్రాస్ చేసి, రహదారికి పడమరగా వెళుతోంది. మైలవరానికి పడమరగా వచ్చే లైను మైలవరం దాటాక హైవే క్రాస్ చేసి, జంగాలపల్లి మీదుగా తిరువూరు వైపునకు వెళుతోంది.
కొత్త రవాణా కారిడార్ నిమిత్తం సర్వే సంస్థ ద్వారా ప్రతిపాదిత మార్గంలోని గ్రామాల్లో వివరాల సేకరణ జరుగుతోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఆ సంస్థకు సహకారం అందిస్తున్నాం. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనలో భాగంగా ఆయా గ్రామాల్లో సివిల్, ఎలక్టిక్రల్, పర్యావరణ, సామాజిక ప్రభావాలపై పరిశీలన చేస్తున్నారు. తుది నివేదికకు ఆమోదనంతరం భూసేకరణకు రైతులతో సమావేశాలు, ధరల నిర్ణయం తదితర అంశాలపై చర్చలుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
[ 20-04-2024]
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
[ 20-04-2024]
మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. -
మహా మాయగాళ్లు..!
[ 20-04-2024]
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. -
పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు
[ 20-04-2024]
అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. -
కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ
[ 20-04-2024]
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. -
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
[ 20-04-2024]
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
కోతల జోగి.. చేతలు ఏవీ..?
[ 20-04-2024]
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. -
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్