టోల్ కట్టినా.. గుంతల రోడ్లే దిక్కు!
జగదల్పూర్ వెళ్తున్న ఓ భారీ వాహనం అక్కడ మలుపు తిరగలేక ఇరుక్కుపోయింది. అంతే.. ఇరువైపులా ట్రాఫిక్ దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. దీన్ని అక్కడి నుంచి తప్పించడానికి పోలీసులు క్రేన్లు దాదాపు 6గంటలవరకు శ్రమించాయి.
జాతీయ రహదారుల పరిస్థితి
రామచంద్రాపురం వద్ద జాతీయ రహదారి ఇలా!
ఈనాడు, అమరావతి: జగదల్పూర్ వెళ్తున్న ఓ భారీ వాహనం అక్కడ మలుపు తిరగలేక ఇరుక్కుపోయింది. అంతే.. ఇరువైపులా ట్రాఫిక్ దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. దీన్ని అక్కడి నుంచి తప్పించడానికి పోలీసులు క్రేన్లు దాదాపు 6గంటలవరకు శ్రమించాయి. వాహనాలు వెళ్లేందుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో 6 గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ-జగదల్పూర్ ఎన్హెచ్- 30 రహదారిపై ఈ సంఘటన జరగడం విశేషం. రాష్ట్రంలో ఎన్హెచ్ 630 దాదాపు పూర్తయింది. కానీ ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద సమస్య ఏళ్లతరబడి పరిష్కారం కావడవం లేదు. మరోవైపు గుత్తేదారు తనకు సంబంధం లేదని కాంట్రాక్టు ముగించారు. తుది బిల్లు తీసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా టెండర్లు పిలిచి రహదారి నిర్మాణం చేయాలన్న ఎన్హెచ్ఏఐ ప్రయత్నాలు నెరవేరడం లేదు. ప్రయాణీకులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఎందుకిలా..?
ఎన్హెచ్ 30 ఇబ్రహీంపట్నం నుంచి జగదల్పూర్ వరకు నిర్మాణం చేస్తున్నారు. దీనిలో భాగంగా గోదావరి నదిపై భద్రాచలం వద్ద రెండో వంతెన నిర్మాణం చేస్తున్నారు. ఏపీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే 80 కిలోమీటర్లదూరం నిర్మాణం చేయాలి. ఈ జాతీయ రహదారిలో రెండు ప్రాంతాల్లో నిర్మాణం వదిలివేశారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద, ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద మిగిలిపోయింది. రామచంద్రాపురం వద్ద కిలోమీటరు విస్తరణ వదిలివేశారు. ఇక్కడ గ్రామం మధ్యలో నుంచి నిర్మాణం చేయాల్సి ఉంది. గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు. బైపాస్ కోసం న్యాయస్థానానికి వెళ్లారు. ఇక్కడ కీలక మలుపు ఉంటుంది. ఇటీవల ఓ భారీ వాహనం అడ్డంతిరిగి ఇరుక్కుపోయింది. తరచూ ఇక్కడ రహదారి మరమ్మతులకు గురవుతుంది. కనీసం వీటిని మరమ్మతులు చేయటంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీనికి పరిఆరం చెల్లింపులు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా టెండర్లు పిలిచారు. కొన్ని ఇళ్లను కూల్చివేశారు. ఈలోగా ప్రవాసాంధ్రులు ఒకరు తనకు పరిహారం అందలేని న్యాయస్థానానికి వెళ్లారు. దీంతో పనులు మళ్లీ ఆగిపోయాయి. ఇది తేలేవరకు అక్కడ రహదారి నిర్మాణం నిలిచిపోవాల్సిందే. అసలు గుత్త సంస్థ దిలీప్ బిల్డ్ కాన్ దీన్ని వదిలేసింది. ప్రత్యేకంగా టెండర్లు పిలిచి అప్పగించినా పనులు ముందుకు సాగడం లేదు. కానీ ఈ గ్రామానికి ముందు బాడవ వద్ద టోల్ వసూలు చేస్తున్నారు. ఇటీవల టోల్రేట్లు పెంచారు. కనీసం రోడ్డు నిర్మాణం చేయకుండా టోల్ వసూలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదే రహదారిపై తెలంగాణలో గౌరవరం వద్ద టోల్ వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ రహదారిపై కూడా..!
హైదరాబాద్ జాతీయ రహదారి అంబారుపేట క్రాస్ రోడ్డు వద్ద అసంపూర్తిగా వదిలేశారు. భూసేకరణ కోసం ఎదురు చూస్తున్నారు. నందిగామ వద్ద ఏడు కిలోమీటర్లు జాతీయ రహదారి విస్తరణ చేపట్టారు. ఆరు కిలోమీటర్లు నిర్మాణం పూర్తయింది. ఒక కిలోమీటరు ఆగిపోయింది. రెండేళ్లు గడిచాయి. నందిగామ పట్టణంలోకి వెళ్లేందుకు అండర్ పాస్ ఏర్పాటు చేయాలి. అక్కడే ఒక బస్బే, బస్స్టాప్ ఏర్పాటు చేయాలి. దీనికి భూసేకరణ కావాలి. రెవెన్యూ అధికారులు రేపు మాపు అంటున్నారు. ఇక్కడ రాకపోకలకు జాతీయ రహదారిపై డివైడర్లు అడ్డదిడ్డంగా ఏర్పాటు చేశారు. వీటిని అంచనా వేయని వాహనదారులు వేగంతో వచ్చి ఢీకొడుతున్నారు. కొన్ని సంఘటనలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని సంఘటనల్లో గాయాలతో బయటపడుతున్నారు. రోజుకు రెండు మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనాసాగర్ వద్ద సర్వీసు రోడ్డు పరిస్థితి అదే విధంగా ఉంది. త్వరలోనే పూర్తి చేయిస్తామని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెబుతున్నారే తప్ప ఖచ్చితమైన గడువులు ప్రకటించడంలేదు..
బందరుకు చేయిచ్చారు..!
విజయవాడ- బందరు జాతీయ రహదారి 64 కిలోమీటర్లు నాలుగు వరసలుగా విస్తరించారు. రూ.800 కోట్ల ప్రాజెక్టు. దీనిలో భాగమే బెంజి పైవంతెన నిర్మాణం. ఏడాది కిందట పూర్తి చేశారు. దిలీప్ బిల్డ్కాన్ సంస్థ కాంట్రాక్టు. కానీ మధ్యలో కొన్ని పనులు వదిలివేశారు. బెంజి సర్కిల్ సెంటర్ నుంచి నిర్మాణం చేయాల్సి ఉంటుంది. కానీ బెంజి సర్కిల్ నుంచి ఆటోనగర్ గేట్ వరకు వదిలివేశారు. కారణం కొన్ని భవనాలను కూల్చివేయాల్సి ఉంది. దీనికి వీఎంసీ ముందుకురాలేదు. దీంతో గుత్త సంస్థ ఈ భాగాన్ని కాంట్రాక్టు నుంచి మినహాయించింది. ప్రస్తుతం వీఎంసీ నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 168 భవనాలను కూల్చివేయాల్సి ఉంది. ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. కంకిపాడు మండలం కొణతనపాడు వద్ద రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అయిదు ప్రాంతాల్లో గుత్తేదారు పనులు వదిలివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే
[ 20-04-2024]
మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. -
మహా మాయగాళ్లు..!
[ 20-04-2024]
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. -
పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు
[ 20-04-2024]
అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. -
కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ
[ 20-04-2024]
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. -
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
[ 20-04-2024]
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
కోతల జోగి.. చేతలు ఏవీ..?
[ 20-04-2024]
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. -
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
రాజీనామా చేయకుంటే.. ఊరుకోం..!
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి