32 నెలలుగా వేతనాల్లేవ్
విద్యతోనే అభివృద్ధి సాధ్యం. దానిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంతోమంది పిల్లలు ఆశ్రయం పొందుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఓ మంచి లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినా,
పోస్టుమెట్రిక్ ఎస్సీ వసతి గృహాల్లో సిబ్బంది ఇక్కట్లు
విజయవాడ సిటీ, పటమట, న్యూస్టుడే
సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం
విద్యతోనే అభివృద్ధి సాధ్యం. దానిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంతోమంది పిల్లలు ఆశ్రయం పొందుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఓ మంచి లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినా, విధానపరమైన లోపాలతో కొన్ని సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్న పిల్లలకు అన్నం, కూరలు వండే కుక్లు, వంటకు సాయం చేయడం, భోజనం వడ్డించే హెల్పర్లు, వసతిగృహానికి రక్షణగా ఉండే కాపలాదారులకు వేతనాలు ఇవ్వడం లేదు. దాదాపు 32 నెలల నుంచి వారికి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను పరిష్కరించమని ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులను కలిసిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయారు. మరికొందరు ఉన్న వేరే దారి లేక, సర్వీస్ పోతుందనే భయంతో విధులు నిర్వహిస్తున్నారు. బయట నుంచి అప్పులు తీసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని వారు వాపోతున్నారు. తమకు వేతన బకాయిలు ఇవ్వాలని, ఆప్కాస్లో విలీనం చేయాలని వారు కోరుతున్నారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థుల కోసం సుమారు 27 పోస్టు మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి భోజనం వండడానికి కుక్, వడ్డించడం, పరిశుభ్రత పనులకు సహాయకుడు, రాత్రి సమయంలో కాపలాదారు ఇలా 81 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీళ్లకు రెండున్నరేళ్ల నుంచి వేతనాలు రావడం లేదు.
ఎందుకీ వివక్ష
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ వసతి గృహాల్లో దాదాపు 13 ఏళ్ల నుంచి చాలామంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో చేస్తున్న వారిని కొంత కాలం ఆపేశారు. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో వారిని మాత్రం ఆప్కాస్లో విలీనం చేశారు. వీరికి ప్రతి నెల వేతనాలు వస్తున్నాయి. ‘పోస్టుమెట్రిక్’ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని 1.12.2019న మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఈసారి ఔట్సోర్సింగ్లో కాకుండా వివిధ కాంట్రాక్టు ఏజన్సీల ద్వారా నియమించారు. అప్పటి నుంచి పనిచేస్తున్నా ఇంతవరకు వేతనాలు ఇవ్వడం లేదు. తమతో పాటు విధులు నిర్వహించిన ‘ప్రీˆమెట్రిక్’ వారిని ఆప్కాస్లో తీసుకుని, తమపై మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఔట్సోర్సింగ్ కింద తీసుకున్నారని, కృష్ణా జిల్లాలో ఇంకా అమలు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
పనిచేసిన వేతనాలు రాకపోవడంతో 32 నెలల నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కుటుంబ నిర్వహణకు బయట నుంచి అప్పులు తీసుకొస్తున్నాం. వడ్డీలు ఆర్థిక భారంగా మారాయి. వెంటనే బకాయిలు మంజూరు చేయాలి. విద్యార్థుల సంఖ్యను బట్టి వేతనాలు ఇచ్చే విధానాన్ని విరమించాలి. అప్కాస్లో విలీనం చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించాలి.
- చిన్నం సుశీల, అధ్యక్షురాలు, ఎస్సీ వసతి గృహాల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం, ఎన్టీఆర్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు