మన నేలపై కొలువుదీరాలి..!
హైదరబాద్లో పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులు మన రాష్ట్రం వారే.. మనప్రాంతం వారే.. ఇక్కడ అవకాశాలు లేక అక్కడికి వెళ్లి వారి మేథస్సును వినియోగిస్తున్నారు. సాంకేతిక విద్య చదివిన విద్యార్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలు మనవి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అత్యధికంగా విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరే కాకుండా కృష్ణా జిల్లా నుంచి డిగ్రీ, పీజీ విద్యను ఏటా 30వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరంతా అటు ప్రభుత్వ కొలువుల వైపు లేదా ప్రాంగణ నియామకాల్లో ఎంపికై పక్క రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్నారు.
వంద మంది యువతతో సర్వే
న్యూస్టుడే, విజయవాడ విద్య
దేశంలో ప్రతి ముగ్గురు ఐటీ ఉద్యోగుల్లో ఒక్కరు తెలుగువారు.. వారంతా హైదరబాదులో ఉన్నారు.
- ఇది ఓ సర్వే నివేదిక
హైదరబాద్లో పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులు మన రాష్ట్రం వారే.. మనప్రాంతం వారే.. ఇక్కడ అవకాశాలు లేక అక్కడికి వెళ్లి వారి మేథస్సును వినియోగిస్తున్నారు. సాంకేతిక విద్య చదివిన విద్యార్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలు మనవి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అత్యధికంగా విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరే కాకుండా కృష్ణా జిల్లా నుంచి డిగ్రీ, పీజీ విద్యను ఏటా 30వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరంతా అటు ప్రభుత్వ కొలువుల వైపు లేదా ప్రాంగణ నియామకాల్లో ఎంపికై పక్క రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. కొత్త రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లయింది. ఇక్కడకు బహుళ జాతి సంస్థలు వస్తే.. పక్క రాష్ట్రాల వైపు మన విద్యార్థులు వెళ్లే అవసరమే ఉండదు. వచ్చే 25 ఏళ్లలో మన ప్రాంతంలోనే మన విద్యార్థులు ఉపాధి అవకాశాలు లభించాలని కోరుకుంటున్నారు. అలాగే పరిశ్రమలు రావాలి, యువతరం స్టార్టప్లతో ముందడుగు వేసేలా శిక్షణ ఇవ్వాలి.
ఐటీ సంస్థలు ఇక్కడే నెలకొల్పాలి
ఎస్.గీతిక, బీటెక్ విద్యార్థిని
ప్రస్తుతం మన ప్రాంతంలో విద్యార్థులు అత్యధిక వార్షిక వేతనంతో ఎంపికవుతున్నారు. కానీ కొలువులు చేయటానికి పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. వచ్చే 25 ఏళ్లలోనైనా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు దీటుగా తయారవ్వాలి.
అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు రావాలి
-బీఎస్ఎన్ దుర్గాప్రసాద్, ఐఏఎస్ అకాడమీ
ఈ ప్రాంతంలో పేరున్న అంతర్జాతీయ సంస్థలు లేవు. మన ప్రాంతానికి సెంట్రల్ యూనివర్సటీ కావాలి. బిజినెస్ స్కూల్ ఇక్కడ లేదు. ఐఎస్బీ (ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్), ఐఎస్ఐ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్), ఐఐఎస్సీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) సీసీఎంబీ, ఐఐసీటీ లాంటి సంస్థలు ఇక్కడ రానున్న రోజుల్లో ఏర్పాటు చేయాలి. ఇక్కడ పరిశోధనా సంస్థలను నెలకొల్పాలి. స్థానిక విద్యార్థులకు అవకాశాలు కల్పించాలి. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇతరులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక వనరులు పెరుగుతాయి.
నైపుణ్య శిక్షణ కేంద్రాలు అవసరం
-కోటంరాజు శరత్కుమార్, డైరెక్టర్, కేఎల్ విశ్వవిద్యాలయం
గ్రామీణ యువత ఎక్కువగా ఉన్న జిల్లాలు మనవి. వీరికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదంతో రానున్న రోజుల్లో ఎక్కువగా వస్తువుల ఉత్పత్తి మన దగ్గరే జరిగే అవకాశం ఉంది. వీటికి తగినట్టుగా యువతలో నైపుణ్యాలు పెంపొందించాలి. ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ మన విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇక్కడే బహుళజాతి సంస్థలు వచ్చేలా కృషి చేయడం ద్వారా మన యువతకు మన దగ్గరే ఉద్యోగాలు వస్తాయి.
పరిశ్రమల ఏర్పాటే ప్రధానం
ఎ.చరణ్, బీటెక్ విద్యార్థి
మన ప్రాంతంలోని పారిశ్రామికవాడలలో పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. పరిశ్రమలు ఉన్నప్పుడే విద్యార్థులకు, యువతకు ఉపాధి దొరుకుతుంది. ఉన్న ఎంఎస్ఎంఈలు కూడా కరోనా కారణంగా మూతపడేస్థితిలో ఉన్నాయి. రానున్న రోజులలో ఇండస్ట్రియల్ జోన్లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలి. ప్రైవీటీకరణ ఊపందుకున్న నేపథ్యంలో పారిశ్రామీకరణను, అంకురాలను ప్రోత్సహించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
[ 20-04-2024]
మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. -
మహా మాయగాళ్లు..!
[ 20-04-2024]
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. -
పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు
[ 20-04-2024]
అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. -
కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ
[ 20-04-2024]
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. -
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
[ 20-04-2024]
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
కోతల జోగి.. చేతలు ఏవీ..?
[ 20-04-2024]
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. -
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.