పల్లెల్లో వెలుగులేవీ..!
పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పటికే విద్యుత్తు బిల్లుల బకాయిలు భారంగా మారగా దీపాల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
పంచాయతీలకు భారంగా వీధిదీపాల నిర్వహణ
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే
పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పటికే విద్యుత్తు బిల్లుల బకాయిలు భారంగా మారగా దీపాల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణకు రెండు గుత్తేదారు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం అర్ధంతరంగా రద్దుచేసుకుని ఆ బాధ్యతను నిధుల కొరతతో సతమతమవుతున్న పంచాయతీలపై మోపడంతో పూర్తి స్థాయి వెలుగులు పంచలేని దుస్థితి కొనసాగుతోంది.
క్రమంగా ఆదాయ వనరులు కోల్పోతూ వస్తున్న గ్రామ పంచాయతీలకు సమకూరే ఆదాయంలో అధిక శాతం వీధి దీపాలు, రక్షిత మంచినీటి పథకాల వినియోగానికి సంబంధించి వచ్చే విద్యుత్తు బిల్లులకే ఖర్చవుతుంటుంది. సక్రమంగా బిల్లులు చెల్లించలేదన్న కారణంగా సంబంధిత శాఖ తరచూ చాలా పంచాయతీలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సందర్భాలున్నాయి. ఇది కాకుండా వీధిదీపాల నిర్వహణలో భాగంగా మాడిపోయిన బల్పులు, చౌక్లు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు నిమిత్తం ఆయా పంచాయతీల స్థాయిని బట్టి ఏడాదికి రూ. లక్షల్లోనే ఉంటుంది. మొత్తం మీద వీధి దీపాల నిర్వహణ, కరెంటు బిల్లుల చెల్లింపు అంశం ప్రతి పంచాయతీకి ఆర్థిక గుదిబండలా ఉంటుంది.
అర్ధంతరంగా ముగిసిన ఒప్పందం
గ్రామాల్లో విద్యుత్తు సంబంధిత ఖర్చులు తగ్గించడంతో పాటు మెరుగైన వీధిదీపాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో 2018లో అప్పటి ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వీధిదీపాల నిర్వహణ ఖర్చు సున్నా చేయడంతో పాటు కరెంటు వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలకు అప్పగించారు. జిల్లాలో ఎల్ఈడీల నిర్వహణ బాధ్యతలను నెడ్క్యాప్, ఈఎస్ఎస్ఎల్ సంస్థలు దక్కించుకున్నాయి. ఒక్కో ఎల్ఈడీ బల్బు ఇన్స్టలేషన్ ఛార్జి నిమిత్తం రూ.150రూలు, నిర్వహణ కోసం ప్రతి బల్బుకు నెలకు రూ.50 చొప్పున చెల్లించేలా పది సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అనుగుణంగా అన్ని పంచాయతీల్లో బల్బులు ఏర్పాటు చేసిన సంస్థలు వాటి నిర్వహణ విషయంలో చూపుతున్న నిర్లక్ష్యం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమైనా పంచాతీయలకు విద్యుత్తు దీపాల నిర్వహణ పరంగా ఎటువంటి ఆర్థికభారం లేకపోవడంతో కాస్త ఉపశమనం దక్కినట్టయ్యింది. బల్బులు మాడిపోవడం, కనెక్టర్లు, ఎడాప్టర్లు వంటివి పాడైన సందర్భాల్లో అవసరాన్ని బట్టి స్థానిక ఎలక్ట్రీషియన్లతో సరిచేయించుకున్నా అందుకు చేసిన ఖర్చును గుత్తేదారు సంస్థలే భరించేవి. ఏడాదిన్నర క్రితం గుత్తేదారు సంస్థలకు పంచాయతీలు చెల్లించాల్సిన ఇన్స్టలేషన్, ఐడీసీ ఛార్జీలు, నిర్వహణ బిల్లుల మొత్తం దాదాపు రూ.25కోట్ల మేర పేరుకుపోవడంతో సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి చేశాయి. స్పందించిన ఉన్నతాధికారులు తక్షణం బిల్లు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించడంతో యుద్ధప్రాతిపదికన ఇన్స్ట్టలేషన్ ఛార్జీలు పూర్తిగా, సగం వరకూ నిర్వహణ ఛార్జీలను చెల్లించారు. ఇక ఇబ్బందులు తొలిగాయని భావిస్తున్న సమయంలో కొన్ని నెలల క్రితం ప్రభుత్వం ఎల్ఈడీల నిర్వహణ బాధ్యతను గుత్తేదారు సంస్థల నుంచి రద్దు చేసి పంచాయతీలకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
సర్దుబాటులతో సతమతం
ప్రభుత్వ చర్యలతో ఖాళీ ఖజానాలతో ఉన్న పంచాయతీలకు ప్రస్తుతం ఎల్ఈడీల నిర్వహణ మరింత భారంగా మారింది. వర్షాకాలం దృష్ట్యా చేపట్టాల్సిన మెరుగైన పారిశుద్ధ్య చర్యలతో పాటు అందుకు తగ్గ విధంగా వీధిదీపాల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతోంది. తరచూ మాడిపోయే బల్బులు, చోక్ల కొనుగోలుకు సగటున ప్రతి మేజర్ పంచాయతీకి నెలకు రూ.15 వేల వరకూ ఖర్చవుతోంది. మైనర్ పంచాయతీలకు ఎల్ఈడీ బల్బులు అందుబాటులో లేకపోవడంతో పోయినస్థానంలో కొత్తవి వేసేందుకు వారాల పాటు ఎదురుచూడాల్సి వస్తోందన్న ఆరోపణలున్నాయి. కొన్ని పంచాయతీల్లోని అంతర్గత రహదారుల్లోని దీపాలు మాడిపోయినా వెంటనే కొత్తవి వేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, ఘంటసాల, కోడూరు, గూడూరు, బందరు మండలం తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వీధిదీపాలు వెలగని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. స్థానిక వార్డు సభ్యుల ఒత్తిళ్లు ఉన్న చోట్ల కార్యదర్శులే భారం భరిస్తూ నాలుగైదు అవసరం ఉన్న చోట్ల ఒకట్రెండుతో సరిపెడుతున్నారు. ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు లేకుండా వీధి దీపాల నిర్వహణ కోసం సతమతమవ్వాల్సి వస్తోందని పలువురు కార్యదర్శులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి