సాంకేతిక ఆధారాలతో ఛేదించారు
నిండా 22 ఏళ్లు కూడా లేని యువకులు ముఠాగా ఏర్పడి అతి కిరాతకంగా ఆరుగురిని హత్య చేశారు. మరో 12 మందిని చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంతలో వారి పాపం పండి ఏటీఎం చోరీ యత్నం కేసులో పోలీసులకు దొరికిపోయారు.
నరహంతక ముఠా కేసులో పరిశోధనకు ప్రతిభకు పురస్కారాలు
శ్రీనివాస్, సత్యనారాయణలకు కేంద్ర హోం మంత్రి పతకాలు
కొల్లి శ్రీనివాసరావు సత్యనారాయణ
ఈనాడు - అమరావతి: నిండా 22 ఏళ్లు కూడా లేని యువకులు ముఠాగా ఏర్పడి అతి కిరాతకంగా ఆరుగురిని హత్య చేశారు. మరో 12 మందిని చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంతలో వారి పాపం పండి ఏటీఎం చోరీ యత్నం కేసులో పోలీసులకు దొరికిపోయారు. తీగలాగితే వారి నేర చరిత్ర అంతా బయటకు వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన ఏడీసీపీ కొల్లి శ్రీనివాస్, సీఐ ముత్యాల సత్యనారాయణలకు శుక్రవారం ప్రకటించిన జాబితాలో కేంద్ర హోం మంత్రి పతకాలు వరించాయి. ప్రస్తుతం శ్రీనివాస్ కమిషనర్ టాస్క్ఫోర్స్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా, సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ సీఐగా పనిచేస్తున్నారు.
పోరంకిలోని ఓ బ్యాంకు ఏటీఎంలో గత ఏడాది జూన్లో చోరీ యత్నం జరిగింది. సీసీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా అనుమానంపై తాడిగడపకు చెందిన ఆటోడ్రైవర్ చక్రవర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ముఠాలోని మిగిలిన వారిని కూడా అరెస్టు చేశారు. మొదట్లో వీరు గతంలో చేసిన హత్యల గురించి బయటకు రాలేదు. నిందితుల వేలిముద్రలను విశ్లేషించగా కంచికచర్లలో 2020, డిసెంబరులో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితుల వాటితో సరిపోయాయి. పోరంకి, తాడిగడప, కామయ్యతోపు ప్రాంతాలకు చెందిన ప్రభుకుమార్, గోపీ రాజు, చక్రవర్తి అలియాస్ చక్రి, నాగదుర్గారావు అలియాస్ చంటి ఆటో డ్రైవర్లుగా పనిచేస్తుంటారు. ఫణీంద్ర కుమార్ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. నేరాలు చేయడం ద్వారా సులువుగా డబ్బు సంపాదన కోసం గ్యాంగుగా ఏర్పడ్డారు. పగటి పూట ఆటోలు నడుపుకునే వారు. కూరగాయలు అమ్మేవారు. జనావాసాలకు దూరంగా ఉన్న ఇళ్లల్లో ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకునే హత్యలకు పాల్పడే వారు. పోరంకి విష్ణుపురం కాలనీలో నళిని, తూముల సెంటర్లో సీతామహాలక్ష్మి, పాత పోస్టాఫీసు సమీపంలో పాపమ్మ, తాడిగడపలో కట్టపై ఒంటరిగా ఉంటున్న ధనలక్ష్మి, కంచికచర్లలో నాగేశ్వరరావు, ప్రమీలారాణి దంపతులను వారి ఇళ్లల్లోకి ప్రవేశించి హతమార్చి ఆభరణాలను దోచుకెళ్లారు. నిందితుల నుంచి రూ. 9.60 లక్షల విలువైన ఆభరణాలు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు