చెత్త పన్ను వసూలు చేయకుంటే సస్పెన్షనే
‘నగరంలో ఇంటింటా చెత్తపన్ను వసూలు చేయండని అనేక సార్లు చెబుతున్నా.. నిరంతరం ఫాలోప్ చేస్తున్నా, మీలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఇకపై వసూళ్లను మెరుగుపర్చకపోతే బాధ్యుల జీతాల్లో కోత పెడతాం..
టెలీ కాన్ఫరెన్సులో నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశం
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ‘నగరంలో ఇంటింటా చెత్తపన్ను వసూలు చేయండని అనేక సార్లు చెబుతున్నా.. నిరంతరం ఫాలోప్ చేస్తున్నా, మీలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఇకపై వసూళ్లను మెరుగుపర్చకపోతే బాధ్యుల జీతాల్లో కోత పెడతాం.. అవసరమైతే ఒకరిద్దరిని విధుల నుంచి సస్పెండ్ చేస్తా’ అని ప్రజారోగ్య విభాగం అధికారులు, క్షేత్రస్థాయి, సచివాయల ఉద్యోగులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీవ్రంగా హెచ్చరించారు. వారితో ఆయన మంగళవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్సులో చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. చెత్తపన్ను వసూళ్లు ఇటీవల కాలంలో పూర్తిగా మందగించాయి. దీంతో రోజువారీ, నెలవారీ వసూళ్ల నివేదికలను పరిశీలిస్తున్న కమిషనర్.. బాధ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తూనే ఉన్నారు.. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో చీఫ్ మెడికల్ అధికారి, సహాయవైద్య అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయపు శానిటరీ సెక్రటరీలతో ఆకస్మికంగా టెలీకాన్ఫరెన్సు నిర్వహించి హెచ్చరికలు జారీచేశారు.
కఠిన చర్యలు తప్పవు
ఇకపై చెత్తపన్ను సక్రమంగా వసూలు చేయనివారిపై కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. ఇందుకోసం సిబ్బంది కచ్చితంగా ఈపాస్ యంత్రాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. మరోవైపు చెత్తపన్ను కింద చెక్ తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇక నుంచి రోజూ ఉదయం 9-10 మధ్య ఒక అర గంట దీనిపై సమీక్షిస్తానని తెలిపారు. ఇందుకు సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీ పూర్తిగా బాధ్యత తీసుకుని బకాయిలు వసూలు చేయాలని ఆదేశించారు.
అనంతరం సచివాలయ ముఖ్య అధికారిణిని కమిషనర్ టెలీ కాన్ఫరెన్సులోకి తీసుకున్నారు. ఆమె నుంచి చెత్తపన్నుపై వివరాలు సేకరించారు. మీకు ఈ పాస్ యంత్రాలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. అందరికీ అందాయని, కానీ సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, వసూలు చేసినా సైట్లో కనిపించడంలేదని ఆయన దృష్టికి తెచ్చారు. తర్వాత చీఫ్ మెడికల్ అధికారి బాబూ శ్రీనివాస్ను లైన్లోకి తీసుకున్నారు. ‘ఏమయింది? బాబూ? కలెక్షన్ అంతా తగ్గిపోయింది?’ ఏంటంటూ ప్రశ్నించారు. సెలవులు వచ్చాయని, అయినా.. 3 రోజులకు రూ.3 లక్షలు వసూలు చేసినట్లు ఆయన బదులిచ్చారు. తక్కువ వసూలు చేస్తున్నవారందిరికీ మెమోలు ఇచ్చానని తెలిపారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ తక్కువ వసూళ్లు చేస్తున్న వారిని గుర్తించి ఆఫీసుకు పిలిపించండని సూచించారు. కావాలంటే ఇద్దరు ముగ్గురిని సస్పెండ్ చేయండని చెప్పారు. ఇకపై నిత్యం రూ.7 లక్షల వసూళ్ల లక్ష్యం చేరుకోవాలని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM