logo

20న మెగా ఉద్యోగ మేళా

జిల్లా ఉపాధి కార్యాలయం, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ,  మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డాక్టర్‌ పి.వి.రమేష్‌ కుమార్‌

Published : 17 Aug 2022 04:56 IST

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: జిల్లా ఉపాధి కార్యాలయం, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ,  మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డాక్టర్‌ పి.వి.రమేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మైలవరంలోని లక్కిరెడ్డి హానిమి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే ఉద్యోగ మేళాకు 16 సంస్థల ప్రతినిధులు హాజరై 1900 ఖాళీలకు ఎంపికలు జరుపుతారన్నారు. బీపీవో, డేటా ఎంట్రీ, ఈ-కామర్స్‌, రిటైల్‌, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని చెఆ్పరు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ , బీటెక్‌ నుంచి పీజీ విద్యార్హుతలున్న నిరుద్యోగ యువతకు పాల్గొనవచ్చని చెప్పారు. ఆసక్తి, అర్హత కల్గిన అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీలు, చిరునామా, ఆధార్‌ కాపీలతో శనివారం ఉదయం మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రావాలన్నారు. ఇతర వివరాలకు 8688842879, 9966090377 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని