టిడ్కో..పేదలను బాదుకో!
‘మీకు టిడ్కో ఇంటికి గృహనిర్మాణ రుణం మంజూరు చేశాం. వాయిదాలు (ఈఎంఐ) లెక్కించడానికి ఇంకా ఏడాది పడుతుంది. ముందు మీరు వడ్డీ కట్టాల్సి ఉంది. వెంటనే వడ్డీ కట్టాలి. లేకపోతే ఇబ్బంది పడతారు..!’ గుడివాడలోని టిడ్కో లబ్ధిదారులకు
ఇళ్లు స్వాధీనం చేయకుండానే వసూలు
ఈనాడు, అమరావతి
గుడివాడలో నిర్మాణం పూర్తయిన ఇళ్లు
‘మీకు టిడ్కో ఇంటికి గృహనిర్మాణ రుణం మంజూరు చేశాం. వాయిదాలు (ఈఎంఐ) లెక్కించడానికి ఇంకా ఏడాది పడుతుంది. ముందు మీరు వడ్డీ కట్టాల్సి ఉంది. వెంటనే వడ్డీ కట్టాలి. లేకపోతే ఇబ్బంది పడతారు..!’ గుడివాడలోని టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకర్లు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారు. వడ్డీలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇక్కడ కనిపించే రశీదు లబ్ధిదారుడు రూ.1720 వడ్డీ చెల్లించారు. తన పేరు బయటకు వస్తే.. వైకాపా నేతలు తన గృహాన్ని ఎక్కడ రద్దు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.
బ్యాంకులు రుణం మంజూరు చేసిన రెండేళ్ల తర్వాత లేదా.. ఇంటిని లబ్ధిదారుడిని స్వాధీనం చేసిన తర్వాత మాత్రమే రుణానికి సంబంధించిన ఈఎంఐలు వసూలు చేయాలి. ముందుగా వసూలు చేసే హక్కు బ్యాంకులకు లేదు..! ఈ విషయాన్ని లబ్దిదారులు ఆయా పురపాలక కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లాలి’ - టిడ్కో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు చిన్నోడు
పట్టణ మౌలిక వసతుల అభివృద్ది సంస్థ నిర్మిస్తున్న ఇళ్లు లబ్ధిదారులకు భారంగా మారాయి. ఇంటిని స్వాధీనం చేయకుండానే బ్యాంకులు వాయిదాలు కట్టమని ఒత్తిడి చేస్తున్నాయి. రుణం మంజూరైన నుంచి లెక్కించి వడ్డీ కట్టాలని తాఖీదులు ఇస్తూ వసూలు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు రూ.150కోట్ల వడ్డీ భారం లబ్ధిదారులపై పడింది.
రుణం ఇవ్వకున్నా.. జిల్లాలో మూడు రకాల గృహాలను 300, 365, 430 చ.అ.విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లు నిర్మాణం అవుతున్నాయి. ప్రస్తుతం 19,376 పూర్తి చేస్తున్నారు. మొదటి రకానికి కేంద్రం, రాష్ట్రం రూ.3లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. రెండో రకానికి రూ.25వేలు, మూడో రకానికి రూ.50వేలు లబ్ధిదారుని వాటా నిర్ణయించారు. బ్యాంకు రుణం రూ.3.15లక్షలు, రూ.3.65 లక్షలు చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించారు. దీనికి అదనంగా కేంద్రం నుంచి రూ.1.50లక్షలు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద అందుతుంది. రాష్ట్రం నుంచి అంతే మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. విజయవాడ నగరంలో 5424, గుడివాడలో 7328 గృహాలను నిర్మాణం చేస్తున్నారు. గుడివాడలో 100శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు 3296 ఉన్నాయి. మరో 5,516 ఇళ్లు 75శాతం పూర్తి అయ్యాయి. జిల్లాలో బ్యాంకులు మొత్తం రూ.679.70కోట్లు రుణం అందిస్తేనే గృహాల నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటి వరకు కేవలం రూ.150కోట్లు ఇచ్చాయి. ప్రస్తుతం వీటికి వడ్డీ వసూలు చేయడం చర్చనీయాంశమైంది.
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో విజయవాడలో 349, జగ్గయ్యపేటలో 5 గృహాలను రిజిస్ట్రేషన్ చేశారు. కృష్ణా జిల్లాలో గుడివాడలో 1472, మచిలీపట్నంలో 683, ఉయ్యూరులో 3 టిడ్కో గృహాలను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ పూర్తయింది. వీరందరినీ ఇప్పుడు కిస్తీలు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి.ఒక్క గృహప్రవేశం కాలేదు. తిరువూరులో 384 గృహాలే ఉన్నాయి. వీటికి బ్యాంకులు రూ.3కోట్లు రుణాలు మంజూరు చేశాయి. కొన్ని లబ్ధిదారుల అంగీకారం మేరకు 10 సంవత్సరాలు, లేదా 15 సంవత్సరాలు గడువు విధిస్తున్నారు.
బాధ్యత ఎవరిది..!
గత రెండేళ్లుగా టిడ్కో ఇళ్లు నిర్మాణం చేయకుండా నిలిపివేశారు. 25 శాతం లోపు పూర్తిగా రద్దు చేశారు. లబ్ధిదారులు తమ వాటాగా రూ.25వేలు, రూ.50వేలు చొప్పున చెల్లించారు. ఇవి చెల్లించి ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి. వీటికి రూపాయి వడ్డీ లేదు. గట్టిగా అడిగితే ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
గుడివాడలో లబ్ధిదారుని దగ్గర వడ్డీ వసూలు చేసిన రశీదు!,
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు