ఇసుక లేదు... కాలనీ ఇళ్లు కట్టేదెలా?
సరిగ్గా.. వారం కిందట వల్లూరుపాలెం, రొయ్యూరు కేంద్రాల్లో 50 వేల టన్నుల ఇసుక నిలువలు ఉండేవి. ప్రస్తుతం శూన్యం. స్థానికులకు సరఫరా చేశారంటే అదీ లేదు. కంచికచర్ల, నందిగామ ప్రాంతం నుంచి వచ్చిన లారీలకు ఎత్తేశారు. ఆ ప్రాంతం మనుషులే అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలకు ఇసుక లేదని చెబుతున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు..!
ఈనాడు, అమరావతి
సరిగ్గా.. వారం కిందట వల్లూరుపాలెం, రొయ్యూరు కేంద్రాల్లో 50 వేల టన్నుల ఇసుక నిలువలు ఉండేవి. ప్రస్తుతం శూన్యం. స్థానికులకు సరఫరా చేశారంటే అదీ లేదు. కంచికచర్ల, నందిగామ ప్రాంతం నుంచి వచ్చిన లారీలకు ఎత్తేశారు. ఆ ప్రాంతం మనుషులే అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలకు ఇసుక లేదని చెబుతున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు..!
జిల్లాలో ఇసుక ఉపగుత్తేదారు మారిన సమయానికి కీసర నిలువ కేంద్రం వద్ద 1.28లక్షల టన్నులు, ఇబ్రహీంపట్నం వద్ద 1.82లక్షల టన్నుల ఇసుక ఉందని అధికారులు లెక్కలు వేశారు. ఆ మేరకు నివేదిక ఇచ్చారు. వారం తిరక్కముందే అక్కడ ఇసుక గుట్టలు కరిగిపోయాయి. రాత్రుల్లోనే ఫ్లడ్లైట్ల వెలుతురులో ఇసుక లోడింగ్ చేశారు. ఎవరికి విక్రయించారు?... ఎంత విక్రయించారు..? అనేది గోప్యం. కేవలం వంద టన్నుల లోపే ఇసుక నిలువ ఉంది.
జిల్లాలో మొత్తం 58 ఇసుక రేవులు, ప్రకాశం బ్యారేజీలో ట్రెడ్జింగ్ ద్వారా వచ్చే ఇసుక విక్రయించేందుకు ప్రధాన గుత్తేదారునికి అవకాశం ఉంది. గత రెండు నెలలుగా కృష్ణా నదికి వరదలు వస్తున్నాయి. కొన్ని రోజులు వరద తగ్గినా మళ్లీ పెరుగుతూ వచ్చింది. దీంతో జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, తోట్లవల్లూరు, అవనిగడ్డ, మోపిదేవి ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో అత్యంత నాణ్యమైన ఇసుక రొయ్యూరు ప్రాంతంలో లభిస్తుందని చెబుతారు. గుత్తేదారు మారినవెంటనే రొయ్యూరు, వల్లూరుపాలెం ఇసుక డంప్లు ఖాళీ అయ్యాయి. ఇదంతా ఎక్కడికి తరలిందనేది అధికారులకు సైతం తెలియని పరిస్థితి.
జగనన్న కాలనీల్లో ఒక ఇంటికి 20 టన్నుల ఇసుక ఉచితంగా అందించాల్సి ఉంది. ఈమేరకు గుత్తేదారుతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 40 కిలోమీటర్లలోపు ఉచితంగానే రవాణా చేయాల్సి ఉంది. ఆ పైబడితే రవాణా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణంపై అధికారులపై నిత్యం ఒత్తిడి పెరుగుతోంది. ఎలాగోలా లబ్ధిదారులను ఒప్పించి నిర్మాణం ప్రారంభించేందుకు ఇసుక లభించడం లేదు. ఉభయ జిల్లాల్లో భారీ లేఔట్లకు ఈప్రభావం కనిపిస్తోంది. చాలామంది రేవు, నిలువ కేంద్రాల వద్దకు వాహనాలతో వెళ్లి ఖాళీగా తిరిగి వస్తున్నారు. ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఇంకా చేపట్టలేదు. తిరువూరు ప్రాంతం వాసులు మైలవరం, ఇబ్రహీంపట్నం వరకు వచ్చి వెళ్లాల్సి వస్తోంది. ఇసుక కొరత ఉన్న మాట వాస్తవమేనని గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ‘ఈనాడు’తో చెప్పారు. త్వరలో పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో
ఉపగుత్తేదారు మారే సమయానికి 8.16లక్షల టన్నుల ఇసుక నిలువలు ఉన్నట్లు నివేదించారు. అవన్నీ ఖాళీ అయ్యాయి. అంతకు ముందే ఇసుక సరఫరా నిలిపివేసి తమకు కావాల్సిన వారికి తరలించారు. ఉపగుత్తేదారు మారిన తర్వాత ఉన్న నిలువలను తరలించారు. ప్రస్తుతం ఇసుక రేవుల్లో తవ్వకాలు లేవు. జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా పూర్తిగా ఆగిపోయింది. భవననిర్మాణ పనులకు ఇసుక కటకటగా మారింది. కృష్ణా నదికి వరద ప్రవాహం ఉండటంతో తవ్వకాలు జరపడం లేదు. ఇంకా ఎన్ని రోజలు ప్రతిష్టంభన కొనసాగుతుందనేది అర్థం కాని పరిస్థితి.
ఇదీ పరిస్థితి..!
బ్రాక్స్స్టన్కు ఇసుక రీచ్ల విషయాలు, క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలు అందించాలని గనుల శాఖకు ఆదేశాలు అందాయి. తర్వాత ఉన్న నిలువను మాత్రం లారీల్లో తరలించేశారు. ఇప్పటి వరకు అమ్మకాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపడం లేదు. స్థానికులకు, భవన నిర్మాణ వ్యాపారులకు ఎలాంటి ఇసుక సరఫరా చేయలేదు. జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా చేయడం లేదు. పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే బంధువే ఇసుక కాంట్రాక్టర్గా మారారు. గ్రావెల్ తవ్వకాలు, ఎన్టీపీఎస్ బూడిద తరలింపులో ఆయనకు మంచి పట్టుఉంది. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో సర్దుబాటు చేసుకుని ఇసుక తవ్వకాల బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది. కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధికి మాత్రం కొంత ఎక్కువ వాటా ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అంటకాగితే.. అంతే రాణా..!
[ 24-04-2024]
అధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
[ 24-04-2024]
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. -
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.