అందరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్కార్డులు: కలెక్టర్
ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు జారీ చేసిన విధంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా హెల్త్కార్డులు అందజేస్తారని కలెక్టర్ రంజిత్బాషా చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేమయ్యారు. ఈ సందర్భంగా
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న రంజిత్బాషా, జేసీ మహేష్కుమార్, ఇతర అధికారులు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు జారీ చేసిన విధంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా హెల్త్కార్డులు అందజేస్తారని కలెక్టర్ రంజిత్బాషా చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారాలకు సంబంధించి అప్లోడ్ చేయాల్సిన ఫొటోలు 32 పెండింగ్లో ఉన్నాయని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గుడివాడలో టిడ్కో గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ఇప్పటివరకూ 1,616 రిజిస్ట్రేషన్లు నిర్వహించారని, వాటిని వేగవంతం చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల కోసం అదనంగా స్కానర్లు, ప్రింటర్ల అవసరం ఉందని జిల్లా రిజిస్ట్రార్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా టిడ్కో, మున్సిపల్ అధికారులకు సూచించారు.
ప్రతి సచివాలయంలో ఆధార్కేంద్రం.. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలను ఆధార్ కేంద్రాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని కలెక్టర్ తెలిపారు. మంగళ, బుధ వారాల్లో రెండు రోజుల పాటు అన్ని సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఆధార్కార్డు తరహాలో ప్రతి పౌరునికి యూనిక్ హెల్త్ ఐడీతో కూడిన హెల్త్కార్డు పంపిణీ మంగళవారం నుంచి చేపడతారన్నారు. ఆప్కో ద్వారా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్టాల్ను కలెక్టర్, జేసీ మహేష్కుమార్ ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
బీచ్ పరిశుభ్రతలో పాల్గొనండి.. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ మంగినపూడి బీచ్ పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు అందరూ వారి కుటుంబసభ్యులతో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.
* గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో గుర్తించిన పనులకు సంబందింÅచి ప్రాధాన్యతా క్రమంలో అంచనాలు సమర్పించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మండలాల వారీ సమీక్ష నిర్వహించారు. కాన్ఫరెన్స్లో సీపీవో వై.శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు ఇవీ..
* విమానాశ్రయ విస్తరణ నిమిత్తం తీసుకున్న భూములకు ఏడు ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వలేదని, తగు చర్యలు తీసుకోవాలని బుద్ధవరం గ్రామానికి చెందిన రైతులు కోరారు.
* జగనన్న కాలనీ నిర్మాణాల కోసం అవసరమైన అన్ని వసతులు ఉన్న భూములను గతంలో ప్రభుత్వం ఇచ్చిన పారితోషికం కన్నా రూ.2.00 లక్షలు తగ్గించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కొనుగోలు విషయంలో అక్రమాలు లేకుండా చూడాలని పామర్రు గ్రామానికి చెందిన పలువురు రైతులు వినతిపత్రం అందచేశారు.
* గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు గతంలో వలే పారదర్శకంగా పరీక్షా ఫలితాలు ప్రకటించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పద్మకుమారి, రమాదేవి తదితరులు అర్జీ సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా