logo

ఆమెను కాల్చేశాడు

వివాహతేర సంబంధం మహిళ హత్యకు దారి తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముందు అగ్ని ప్రమాదంలో గాయపడినట్లు మహిళ తెలపగా.. అనంతరం ప్రియుడే తనపై టిన్నర్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె పేర్కొంది. ఈ మేరకు గుడివాడ టూటౌన్‌

Published : 27 Sep 2022 05:33 IST

మహిళపై టిన్నర్‌ పోసి నిప్పంటించాడు

వివాహేతర సంబంధం వద్దన్నందుకు హత్య

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే : వివాహతేర సంబంధం మహిళ హత్యకు దారి తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముందు అగ్ని ప్రమాదంలో గాయపడినట్లు మహిళ తెలపగా.. అనంతరం ప్రియుడే తనపై టిన్నర్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె పేర్కొంది. ఈ మేరకు గుడివాడ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును సోమవారం హత్య కేసుగా మార్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బాపూజీనగర్‌కు చెందిన వివాహిత (38) ఈ నెల 12వ తేదీన కాలిన గాయాలతో గుడివాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. గతంలో ఆమె తన పెంపుడు కుక్కకు పేలు(గోమార్లు) తీసి అవి మొత్తం కట్టెల పొయ్యిలో వేసి తగుల బెడుతూ గాయపడినట్లు పోలీసులకు తెలిపింది. అనంతరం ఆమె పరిస్థితి విషమంగా మారడంతో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆమెకు స్థానికంగా ఉండే పచ్చా వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధం ఉంది. అతనికి రూ. లక్ష అప్పుగా ఇచ్చింది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసి అతనితో కలవొద్దని వారించగా వెంకటేశ్వరరావును ఇంటికి రావొద్దని చెప్పింది. అతను ఈ నెల 12న వివాహిత ఇంటికి రాగా వెళ్లిపోవాలని కోరింది. లెక్కచేయని వెంకటేశ్వరరావు ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె వ్యతిరేకించడంతో వెంట తెచ్చుకున్న టిన్నర్‌ను పోసి నిప్పంటించాడు. నాటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం మృతి చెందింది. ఈ మేరకు సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కె.గోవిందరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని