కాళ్లరిగేలా తిరిగినా ఫలితం సున్నా
సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంలో సీఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు పలు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ప్లాట్లను అభ్యంతరకర భూముల్లో ఇవ్వడమే ఇందుకు కారణం. వీటిని మార్చి మరో చోట ఇవ్వమని అన్నదాతలు ఏళ్ల తరబడి రాజధాని ప్రాంత అభివృద్ధి
పరిష్కారానికి నోచుకోని రైతుల అర్జీలు
ఈనాడు - అమరావతి
సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంలో సీఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు పలు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ప్లాట్లను అభ్యంతరకర భూముల్లో ఇవ్వడమే ఇందుకు కారణం. వీటిని మార్చి మరో చోట ఇవ్వమని అన్నదాతలు ఏళ్ల తరబడి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకోమని రైతులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.
పురోగతి అంతంతే..
రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం 28,587 మంది రైతుల నుంచి 34,385 ఎకరాలను సమీకరించింది. దీనికి గాను వారికి నివాస, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలన్నది ఒప్పందం. ఈ మేరకు భూయజమానులకు మొత్తం 64,735 ప్లాట్లను కేటాయించింది. ఇందులో 38,282 నివాస, 26,453.. వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. వీటిని రైతుల పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. గత ప్రభుత్వ హయాంలో 40,378 ప్లాట్లుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది. హైకోర్టు తీర్పు తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తిరిగి సీఆర్డీఏ అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 2,657 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇంకా 21,722 ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాలేదు. ఎటువంటి అభివృద్ధి చేయకుండా.. ఎక్కడికక్కడ ముళ్ల కంపలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవలి? కనీసం స్థలంలోకి వెళ్లడానికి కూడా దారి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీకరణలో ఇవ్వని భూముల్లో చాలా మంది రైతులకు ప్లాట్లు కేటాయించారు. ఇలా దాదాపు 500 మందికి ఇచ్చారు. ఇటువంటి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం సాధ్యపడదు. 29 గ్రామాల్లోని సుమారు 300 మంది వరకు దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో ప్లాట్లు వచ్చాయి. వీటిని మార్చమని పలు సార్లు అర్జీలు ఇచ్చినా స్పందన లేదు. కేపిటల్ గెయిన్స్ మినహాయింపు రెండేళ్ల వరకే వర్తిస్తుంది. ± 3,500 మంది రైతులకు సంబంధించి అభ్యంతరాలు సీఆర్డీఏ వద్ద పెండింగ్లో ఉన్నాయి.
తిరిగి.. తిరిగి..
* మందడం గ్రామానికి చెందిన రాజేష్ భూసమీకరణ కింద వెలగపూడి, మందడం, మల్కాపురం రెవెన్యూ గ్రామాల్లోని 4.85 ఎకరాలను ఇచ్చారు. ఇందులో మల్కాపురంలోని 1.03 ఎకరాల భూమికి సంబంధించి వెయ్యి గజాల మేర రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చింది. దీనికి సంబంధించి న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో ఆ ప్లాట్ను అమ్ముదామన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది.
* తుళ్లూరుకు చెందిన వెంకటేశ్వరరావు 1.50 ఎకరాల భూమిని ఇచ్చారు. దీనికి బదులుగా సీఆర్డీఏ అధికారులు 500 గజాల ప్లాట్లు మూడు, 360 గజాల కమర్షియల్ ప్లాట్ ఒకటి లాటరీ విధానంలో కేటాయించి పత్రాలు అందజేశారు. ఇందులో 500 గజాల ప్లాట్ ఒకదానికి సంబంధించి పూలింగ్లో ఇవ్వని భూమిలో కేటాయించారు. ఈ ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సాధ్యం కాదు. తనకు వచ్చిన ప్లాట్ను వేరే చోట ఇప్పించమని వెంకటేశ్వరరావు పలు సార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదు.
* తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాసరావు సమీకరణలో 3.24 ఎకరాల భూమిని సీర్డీఏకు అప్పగించారు. దీనికి గాను సీఆర్డీఏ అధికారులు వెయ్యి గజాల రెసిడెన్షియల్ ప్లాట్లు మూడు, 750 గజాల కమర్షియల్ ప్లాట్ ఒకటి కేటాయించారు. ఇందులో ఓ నివాస ప్లాట్ను పూలింగ్లో అసలు భూమిలో, మరొకటి చెరువు పోరంబోకులో ఇచ్చారు. వీటిని తన పేరున రిజిస్టర్ చేసుకోవడం సాధ్యం కాదని, మరో చోట ఇవ్వమని అధికారులను కలసి అనేక సార్లు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు