logo

వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద మృతిపై గన్నవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. చనుపల్లివారిగూడెంకు చెందిన వేల్పుల మౌనిక(24), అఖిల్‌లు భార్యాభర్తలు. ఆదివారం రాత్రి గ్యాస్‌నొప్పి ఎక్కువ కావడంతో మౌనిక మరణించిందని

Published : 27 Sep 2022 05:33 IST

గన్నవరం గ్రామీణం: వివాహిత అనుమానాస్పద మృతిపై గన్నవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. చనుపల్లివారిగూడెంకు చెందిన వేల్పుల మౌనిక(24), అఖిల్‌లు భార్యాభర్తలు. ఆదివారం రాత్రి గ్యాస్‌నొప్పి ఎక్కువ కావడంతో మౌనిక మరణించిందని ఏలూరులోని ఆమె అన్నకు అఖిల్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. ఉదయం సంఘటనా స్థలికి చేరుకున్న మృతురాలి బంధువులు.. మౌనిక మెడ చుట్టూ కమిలిన గాయాలు, గాజులు పగిలిన ఆనవాలు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనపై కేసు నమోదుచేసిన ఎస్సై రమేష్‌ దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని