Kodali Nani- Vamsi: జగన్ సమీక్షకు కొడాలి నాని, వల్లభనేని వంశీ గైర్హాజరు
గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్చించినట్లు తెలిసింది. గన్నవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
ఈనాడు, అమరావతి: గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్చించినట్లు తెలిసింది. గన్నవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించకపోవడంపై ప్రాంతీయ సమన్వయకర్తలను ప్రశ్నించినట్లు వైకాపా వర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జులు, రీజినల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ బుధవారం సమావేశం నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరుకాలేదు.
అన్ని నియోజకవర్గాల్లో గడపగడపకు కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో బంధువులతో కాకుండా ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొనాలని సూచించారు. బందరు నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నానికి బదులుగా ఆయన తనయుడు పేర్ని కిట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పైవిధంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. జులై నుంచి ఇప్పటివరకు 70 రోజులకు గాను 20 రోజులకుపైగా నియోజకవర్గాల్లో తిరిగిన ఎమ్మెల్యేలను పరవాలేదని, సంతృప్తి చెందారని తెలిసింది. అంతకంటే ఎక్కువ చేసిన వారికి అభినందనలు తెలిపారు. మరింత విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గడగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్లను అభినందించారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆలస్యంగా ప్రారంభించినా 20 రోజులు ఎక్కువగానే తిరగడంతో సంతృప్తి చెందారు. మంత్రి జోగి రమేష్(పెడన), విప్ సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట), ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు(నందిగామ), రక్షణనిధి(తిరువూరు), అనిల్కుమార్(పామర్రు), సింహాద్రి రమేష్(అవనిగడ్డ), పార్థసారథిలు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా