Kesineni Nani: తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరు: ఎంపీ కేశినేని
ఇళ్లలో కూర్చుని మాట్లాడుతూ, ఎక్కడో ఉండి తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరని విజయవాడ ఎంపీ, తెదేపా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కేశినేని నాని వ్యాఖ్యానించారు. బుధవారం విజయవాడ
భారీ గజమాలతో ఎంపీ నానిని సత్కరిస్తున్న పశ్చిమ నియోజకవర్గ తెదేపా నాయకులు
విజయవాడ వన్టౌన్, న్యూస్టుడే : ఇళ్లలో కూర్చుని మాట్లాడుతూ, ఎక్కడో ఉండి తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరని విజయవాడ ఎంపీ, తెదేపా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కేశినేని నాని వ్యాఖ్యానించారు. బుధవారం విజయవాడ పాతబస్తీ జెండా చెట్టు వీధిలో నూతనంగా నిర్మించిన తెదేపా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని ప్రారంభించారు. కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారాకరామారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే కుల, మతాలకు అతీతమన్నారు. ఇక్కడి ప్రజలు పార్టీని-పార్టీ తరఫున పోటీ చేసే మనిషిని చూసే కాకుండా, వ్యక్తిత్వం వంటివి చూసి ఓట్లు వేస్తారన్నారు. కొంత మంది మీడియాలో వెలిసి నాయకులు అయిపోవాలని చూస్తుంటారని, నాయకులు మీడియాలో నుంచి కాదు, ప్రజల్లో నుంచి వస్తారన్నారు. జగన్ వచ్చాక విజయవాడకు కృష్ణానది, దుర్గగుడి, భవానీ ద్వీపం వచ్చాయని, జగన్ లేకపోతే విజయవాడ లేదనట్లు వైకాపా నాయకులు ప్రచారం ఉందని విమర్శించారు. జగన్ వచ్చాక విజయవాడ మొత్తం నాశనమైందన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ లేదని నిన్న కేంద్రం తెగేసి చెప్పిందని, అయినా చేతకాని ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారని, ఆయనలో చలనం లేదని విమర్శించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించి వివాదం చేశారన్నారు. రాజు సోలంకి సొంత స్థలాన్ని పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇవ్వడం సంతోషాన్నిచ్చిందన్నారు. అనంతరం ఎంపీ కేశినేని నానిని భారీ గజమాలతో తెదేపా నాయకులంతా ఘనంగా సత్కరించారు. తెదేపా పశ్చిమ నియోజకవర్గం నాయకులు పెందుర్తి శ్రీనివాస్, సుకాశి కిరణ్, సుకాశి సరిత, సారిపల్లి రాధాకృష్ణ, బూర కనకారావు, ఎంఎస్ బేగ్, మాజీ కార్పొరేటర్ యెదుపాటి రామయ్య, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
[ 29-03-2024]
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ