Devineni Uma: బావమరిది అక్రమాలు కనపడవా?: ఎమ్మెల్యే వసంతపై దేవినేని ధ్వజం
కృష్ణా నదిలో ఇసుక, కొండపల్లిలో అక్రమ మైనింగ్, మద్యం షాపులు, పేదలకు అందాల్సిన రేషన్ను అక్రమ మార్గాన పక్కదోవ పట్టిస్తోంది ‘నీ బావమరిది’ కాదా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను ప్రశ్నించారు.
దీక్షలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఉమా, చిత్రంలో ధారూనాయక్, రామకృష్ణ తదితరులు
మైలవరం, జి.కొండూరు, న్యూస్టుడే: కృష్ణా నదిలో ఇసుక, కొండపల్లిలో అక్రమ మైనింగ్, మద్యం షాపులు, పేదలకు అందాల్సిన రేషన్ను అక్రమ మార్గాన పక్కదోవ పట్టిస్తోంది ‘నీ బావమరిది’ కాదా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను ప్రశ్నించారు. శనివారం ఆయన జి.కొండూరులోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ పేరు మార్పును వ్యతిరేకిస్తూ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ అక్రమాలు, చెత్త నిర్ణయాలను ప్రశ్నించిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి అరెస్టులు చేయించడం దారుణమన్నారు. చెరువులు ఆక్రమంగా తవ్వుకుంది మీ నాయకులేనని ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. పోలవరానికి పునాదులు వేయలేదంటూ అధికారంలో వచ్చి 40 నెలలైనా ఒక్క పని చేసిన పాపానా పోలేదని, మీ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి నాపై ఆరోపణలు చేయడం చేతగానితనమన్నారు. పైగా తాను చెరువులు, పోలవరం, పట్టిసీమలను దోచేశానంటూ మాయమాటలు చెప్పారని, వారి అక్రమాలను ప్రశ్నించానని తనపై వైకాపా గుండాలతో దాడి చేయించడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించి అరెస్టులు చేశారని మండిపడ్డారు. గడిచిన 40 నెలలు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వానికి 40 ఏళ్ల చరిత్ర కల్గిన తెదేపా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసిన బెదిరే ప్రసక్తే లేదన్నారు. వైకాపాను ఓడించడమే లక్ష్యంగా గ్రామాల్లోని తమ నాయకులు, కార్యకర్తలు కసిగా పని చేయాలని కోరారు. నిరసన దీక్ష చేసిన వారిలో తెదేపా రాష్ట్ర పరిశీలకుడు ధారూనాయక్, రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఉయ్యూరు వెంకటనరసింహారావు, చిన నందిగామ సర్పంచి ధనేకుల శ్రీకాంత్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!