‘ముఖ్యమంత్రికి కప్పం కట్టి ఇసుక దోపిడీ’
ముఖ్యమంత్రికి నెలవారీ కప్పం కడుతూ మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్.. కృష్ణానదిలో ఇసుకను లారీ రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల ధరతో హైదరాబాద్, బెంగళూరు
మాట్లాడుతున్న మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు
మైలవరం, న్యూస్టుడే: ముఖ్యమంత్రికి నెలవారీ కప్పం కడుతూ మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్.. కృష్ణానదిలో ఇసుకను లారీ రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల ధరతో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు అక్రమంగా తరలిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని కోరుతూ ఆదివారం స్థానిక నూజివీడు రోడ్డులోని రామాలయం ఎదుట సాయంత్రం వరకు నిరసనదీక్ష చేశారు. ఈ సందర్భంగా ఇసుక అమ్మకాలకు సంబంధించి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ద్వారా ఇసుకను దక్కించుకుని, బావమరిది అనుచరులతో అక్రమార్జనకు ఎమ్మెల్యే తెరలేపారని ధ్వజమెత్తారు. కృష్ణానదిని దోచుకోవడానికే తెల్లచొక్కా వేసుకొని వచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకు ఇసుక దొరక్క అల్లాడుతుంటే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు క్వారీలను అప్పగించి దోచుకొంటున్నారన్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితులుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్లకు ఇసుకను కట్టబెట్టారని, ఇసులో వాటా ఉందో లేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొండపల్లి అడవి దోపిడీపై నేటికీ చర్యలు లేవని, ప్రస్తుతం ఇసుక దోపిడీ మొదలు పెట్టారన్నారు. లేటరైట్ ముసుగులో బాక్సెట్ తవ్వకాలు సాగిస్తూ ముఖ్యమంత్రి సూచించిన కంపెనీలకు టన్ను రూ.800లకే అమ్మాలని సూచిస్తూ, ఆ కంపెనీలు మాత్రం రూ.1200లకు అమ్ముకొంటున్నాయని చెప్పారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు, కుటుంబసభ్యుల పట్ల సీఐడీ అమానుషంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోమటి సుధాకరరావు, వజ్రాల కుమార్రెడ్డి, జువ్వా రాంబాబు, పోతురాజు, రామకృష్ణారెడ్డి, మల్లెల రాధా, సుధాకర్, నియోజకవర్గ పరిశీలకుడు ధారూనాయక్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?