BRS: ఏపీలోనూ భారత్‌ రాష్ట్ర సమితి హోర్డింగ్‌ల ఏర్పాటు

భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏపీలోనూ ఏర్పాటు చేశారు. విజయవాడలోని వారధి ప్రాంతంలో భారాస పార్టీ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

Published : 05 Oct 2022 15:53 IST

విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భారాస పోస్టర్లు ఏపీలోనూ వెలిశాయి. విజయవాడలోని వారధి ప్రాంతంలో భారాస పార్టీ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. భారాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. హోర్డింగ్‌పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వేర్వేరు చోట్ల పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఏపీలోనూ భారాస హోర్డింగ్‌లు ఏర్పాటు కావడంపై  వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని