Vijayawada: ఎక్కువ మాట్లాడితే.. బయటకు పంపుతా: వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరిక
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: టిడ్కో ఇళ్లు, టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్సు నివేదిక వచ్చాక కౌన్సిల్ ముందుంచి, తెదేపా నేతలను జైలుకు పంపుతామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు.
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: టిడ్కో ఇళ్లు, టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్సు నివేదిక వచ్చాక కౌన్సిల్ ముందుంచి, తెదేపా నేతలను జైలుకు పంపుతామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. సభలో ఎక్కువ మాట్లాడితే బయటకు పంపుతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో సోమవారం ఆయన ఈ వాఖ్యలు చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన సోమవారం ఉదయం ప్రారంభమైన కౌన్సిల్లో సంతాప తీర్మానాలు ఆమోదించిన అనంతరం మీడియాను సభలోకి అనుమతించాలంటూ సీపీఎం ఫ్లోర్లీడర్ బోయి సత్యబాబు పట్టుబట్టడం కాస్తంత గందరగోళానికి దారితీసింది. దీనిపై పాలక సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుందామని మేయర్ సర్ది చెప్పారు. జగనన్న లేఅవుట్లలో నివాసాల కేటాయింపు, టిడ్కో ఇళ్ల లబ్ధిదార్ల వివరాలపై సత్యబాబు అడిన ప్రశ్నపై సభలో వాదోపవాదాలు సాగాయి. అనేకమందికి ఇళ్లు రద్దు అయ్యాయని, పలువురికి సొమ్ము తిరిగి చెల్లించలేదని ఆయన ఆరోపించారు. స్పందించిన వైకాపా సభ్యుడు జానారెడ్డి.. టిడ్కో ఇళ్ల గత అక్రమాలపై విజిలెన్సు విచారణ సంగతేంటని ప్రశ్నించారు. మరోవైపు ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం స్పందిస్తూ తాము అధికారంలోకి వచ్చాక దళారులెవరూ లేకుండా రూ.350 కోట్ల విలువైన స్థలాలను పేదలకు పంచామని తెలిపారు. గతంలో టిడ్కో ఇళ్లపేరిట వసూలు చేసిన సొమ్ములో రూ.16 కోట్లలో ఇప్పటికే రూ.10 కోట్లు తిరిగి చెల్లించామని, మిగిలినవి కూడా త్వరలో ఇస్తామని అన్నారు. సీపీఎం ఫ్లోర్లీడర్ సత్యబాబు కలించుకుని మాట్లాడుతూ ఎంపిక చేసినవారిలో అనేకమందికి ఇళ్లు దక్కకపోయినా, సంక్షేమ పథకాల్లో కోత పడుతుందని ఆరోపించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందిస్తూ ఆ విషయాన్ని మీ పక్కనే ఉన్న ‘పచ్చచొక్కా వాళ్ల’ను అడుగు..అంటూ ఎద్దేవా చేసేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
సమావేశం నిర్వహిస్తున్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి
ఖాళీస్థలాలపై పన్ను బకాయిలే ఎక్కువ.. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరం కొనసాగుతుండగా, 2021-22కు సంబంధించి డిఅండ్ఓ ట్రేడ్ లైసెన్సుల ఫీజుల బకాయిలు రూ.1.72 కోట్లు మాత్రమే చూపడం తగదని తెదేపా సభ్యుడు ముమ్మునేని ప్రసాద్ పేర్కొన్నారు. మొత్తం బకాయిలు ఎంతో తేల్చాలన్నారు. ఖాళీస్థలాల పన్ను బకాయిలు రూ.206.63 కోట్లు ఉంటే, 10 శాతం కూడా వసూలు చేయలేకపోయారని ఆరోపించారు. సీపీఎం ఫ్లోర్లీడర్ బోయి సత్యబాబు మాట్లాడుతూ బకాయిల విషయంలో వన్టైం సెటిల్మెంట్ లేదా వడ్డీమాఫీ చేయాలని సూచించారు. వైకాపా కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ ఇళ్లు కట్టుకున్నా, వీఎల్టీ కొనసాగుతుందని ఆరోపించారు. ఈ సమస్యల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఉప మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి కోరారు. మేయర్ కల్పించుకుని ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిగా స్పందించిన వైకాపా కార్పొరేటర్ బండి పుణ్యశీల.. అధికారపక్షంగా సరైన జవాబు చెప్పించాల్సిన మనకే వాస్తవాలు తెలియడం లేదని, ఇక ప్రజలకు ఏం అర్థం అవుతాయని ప్రశ్నించారు. ఆపై డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ) వెంకట లక్ష్మి సమాధానమిస్తూ ఖాళీస్థలాల యజమానుల వివరాలు పూర్తిగా తెలియడం లేదని, ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఆపై కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడారు. అనంతరం సంబంధిత సమస్యలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుందామని మేయర్ సభలో ప్రకటించారు.బీ నగరంలో భూగర్భ డ్రెయినేజీ అధ్వానంగా ఉందని సభ్యులు పేర్కొనగా, స్పందించిన కమిషనర్ పైపులను శుభ్రం చేసేందుకు టెండర్లు పిలుస్తున్నామని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు
[ 28-03-2024]
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీలు 82 రోజులకు గాను లెక్కించారు. -
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
[ 28-03-2024]
వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. -
అమ్మతోడు.. అడ్డగోలేచూడు!
[ 28-03-2024]
‘‘విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన చుండూరు వెంకటరెడ్డి (సి.వి.రెడ్డి) ఛారిటీస్ స్థలం, భవనాలను అన్యాక్రాంతం చేసేలా అడుగులు పడుతున్నాయి. -
కోడ్ కొండెక్కి.. అక్రమంగా రోడ్డెక్కి
[ 28-03-2024]
కోడ్ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు. -
పశ్చిమ బరిలో సుజనా
[ 28-03-2024]
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. -
నిజం గెలవాలి.. రాష్ట్రం వెలగాలి
[ 28-03-2024]
నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్జంక్షన్, బిళ్లనపల్లిలో పర్యటించారు. -
ప్రలోభాలు అరికట్టేందుకు ముమ్మర తనిఖీలు
[ 28-03-2024]
జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేసి మద్యం, నగదు, కానుకలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎన్నికల అధికారి రాజబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేశారు. -
పార్టీ కోసం పనిచేయాల్సిందే.. ఓటర్లను మభ్యపెట్టాల్సిందే!
[ 28-03-2024]
ప్రతి ఓటరు నాడి పసిగట్టి లోబర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని వైకాపా నాయకులు వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. -
ఎర్రకట్ట విస్తరణ ఎప్పుడో?
[ 28-03-2024]
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది. -
రైల్వే సరకు రవాణాలో రికార్డు ఆదాయం
[ 28-03-2024]
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సరకు రవాణాలో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. -
అయిదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులేవీ?
[ 28-03-2024]
రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
[ 28-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామీణ మండలం దామూలూరు శివారు పంట కాలువ 19న గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. -
సీఎం జగన్ ఎగ్గొట్టిన హామీలు 85% : నెట్టెం
[ 28-03-2024]
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన పార్టీనీ చిత్తుగా ఎందుకు ఓడించాలో చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. -
బీమా సొమ్ము చెల్లించాలని తీర్పు
[ 28-03-2024]
బీమా సొమ్ము చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కమిషన్ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. -
అయిదుగురు బుక్ కీపర్లపై వేటు
[ 28-03-2024]
కృత్తివెన్ను మండలం నీలిపూడిలో ఈ నెల 25న వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయిదుగురు వెలుగు బుక్ కీపర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
దుర్గగుడి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు
[ 28-03-2024]
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో 25 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించగా.. రూ.3,78,72,537 ఆదాయం వచ్చింది. -
కృష్ణా పూర్వ డీపీవో ఉద్యోగం నుంచి తొలగింపు
[ 28-03-2024]
కృష్ణా జిల్లా పూర్వ పంచాయతీ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న సీహెచ్ సుబ్రహ్మణ్యంను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు