కృష్ణ కృష్ణా ..!
‘కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలలకు సంబంధించిన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అనేక అవకతవకలు చోటుచోసుకున్నాయి.
మూల్యాంకనంలో అవకతవకలు
విశ్వవిద్యాలయం తీరుపై విమర్శల వెల్లువ
‘కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలలకు సంబంధించిన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అనేక అవకతవకలు చోటుచోసుకున్నాయి. సెమిస్టర్ 1, 3కి సంబంధించి ఆరు వేలకు పైగా పేపర్లుండగా.. కేవలం 25మంది అధ్యాపకులు మూడే రోజుల్లో వీటిని దిద్దేయడం గమనార్హం. రోజుకు 150 నుంచి 200 పేపర్ల వరకూ దిద్దేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
విశ్వవిద్యాలయంలో అక్టోబరు 27, 28, 29 ఈ మూడు రోజుల్లోనే పేపర్లన్నీ దిద్దేశారు. విద్యార్థులు ఏం రాశారు, సమాధానలు సక్రమంగా రాశారా, లేదా అనేవి చూసి మార్కులు వేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ.. ఈ నిబంధనను గత కొంతకాలంగా పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఎవరికి నచ్చినన్ని పేపర్లను.. వారికి ఇచ్చేస్తూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి వెళ్లిపోమనేలా పరిస్థితిని మార్చేశారు. ఒక పరీక్ష పత్రాన్ని నిశితంగా పరీశీలించి.. సక్రమంగా దిద్దాలంటే.. రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కో అధ్యాపకుడు 30కు మించి దిద్దలేరు.
కనీస పర్యవేక్షణ లేకపోవడంతో..
ప్రస్తుతం ఏ బీఈడీ కళాశాలలోనూ బోధనా సిబ్బంది సరిగా లేరు. అరకొర సిబ్బంది మూల్యాంకనకు వచ్చి విచ్చలవిడిగా దిద్దేస్తుండడంతో.. విద్యార్థులంతా ఉత్తీర్ణులైపోతారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాల్సిన వాళ్లు, ఫెయిల్ అవ్వాల్సిన వాళ్లు ఇద్దరూ ఒకేరకమైన మార్కులను తెచ్చుకుంటారు. ఫెయిలవ్వాల్సిన వాళ్లు ఉత్తీర్ణులైపోయి.. రేపు ఉపాధ్యాయులైపోతారు. దీనివల్ల విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఇలాంటి వారిపై ఉంటుంది. విద్యాప్రమాణాలు పూర్తిగా పడిపోతాయి.ఒక సబ్జెక్టు అధ్యాపకులు.. మరో సబ్జెక్టుకు సంబంధించిన పేపర్లను దిద్దుతున్నారు.
విద్యార్థులు ఏం రాశారనేది చూడకుండా..
కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో 22 బీఈడీ కళాశాలలున్నాయి. వీటిలో కొన్నింటిలో వంద, మరికొన్ని కళాశాలల్లో 50మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఈ లెక్కన మొత్తంగా.. అన్ని కళాశాలల్లో కలిపి 1500మంది వరకూ విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు. రెండేళ్ల బీఈడీ కోర్సులో నాలుగు సెమిస్టర్లుంటాయి. ఆరు నెలలకు ఒక సెమిస్టర్ జరుగుతుంది. తాజాగా ఒకటి, మూడో సెమిస్టర్లకు సంబంధించిన ప్రశ్నపత్రాల మూల్యాంకనం విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ రెండు సెమిస్టర్లకు సంబంధించి కనీసం ఆరు వేల పేపర్లకు పైనే ఉంటాయి. వీటన్నింటినీ 20మంది అధ్యాపకులు కేవలం మూడు రోజుల్లో దిద్దడం అంటే.. కనీసం విద్యార్థులు ఏం రాశారు అనేది చూడకుండా మార్కులు వేసుకుంటూ వెళ్లిపోవడమే అవుతుంది. తాజాగా అలాగే చేశారు. ఒక్కో పేపరుకు తమకు వచ్చే డబ్బులను మాత్రమే చూసుకుని మూల్యాంకనం చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
విద్యావిభాగం ఏదీ?
కృష్ణా విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదు. దీంతో బీఈడీ కళాశాలలు, అధ్యాపకులు, పరీక్షలు, మూల్యాంకనం.. సహా దేనిపైనా సరైన పర్యవేక్షణ లేదు. ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్నే బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్గా పెట్టి ప్రక్రియను నడిపిస్తున్నారు. మూల్యాంకనం పూర్తయిన తర్వాత అధ్యాపకులకు డబ్బులు ఇచ్చే సమయంలోనైనా.. ఎవరెవరు ఎన్ని పేపర్లను దిద్దారనేది పర్యవేక్షిస్తే.. అనేక అవకతవకలు వెలుగులోనికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పైగా.. ఏ సబ్జెక్టు పేపర్లను, ఏ అధ్యాపకులు దిద్దారనేది కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పటికైనా దీనిపై విశ్వవిద్యాలయం ఉన్నతస్థాయి అధికారులు దృష్టిసారించి ప్రక్షాళన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇప్పటికే చాలా బీఈడీ కళాశాలల్లో పరిస్థితి పూర్తిగా గాడి తప్పిపోయింది. కనీసం స్థాయిలోనూ అధ్యాపకులు లేరు. రికార్డులలో మాత్రమే పేర్లు కనిపిస్తున్నాయి. సదరు అధ్యాపకులు ఇక్కడ ఉండరు. ఎవరైనా పర్యవేక్షణకు వస్తున్నారని తెలియగానే.. తీసుకొచ్చి హాజరు చూపిస్తున్నారు. ఇప్పుడు పరీక్ష పత్రాల మూల్యాంకనం సైతం పూర్తిగా గాడి తప్పడంతో.. ఇక విద్యావ్యవస్థ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్