బాబోయ్ ఇదేం కిరికిరీసర్వే..!
రెవెన్యూ రికార్డుల్లో కచ్చితత్వం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే తప్పులతడకగా కొనసాగుతుందనే దానికి అద్దం పట్టేలా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో పలు ఉదంతాలు వెలుగులో వచ్చాయి.
తప్పులతడకగా వివరాలు
నాలుగు నెలలకు 9(2) నోటీసులు
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే
రెవెన్యూ రికార్డుల్లో కచ్చితత్వం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే తప్పులతడకగా కొనసాగుతుందనే దానికి అద్దం పట్టేలా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో పలు ఉదంతాలు వెలుగులో వచ్చాయి. కొన్ని భూ వివరాలు అసలు నమోదు కాకపోవడం, అడంగల్లో ఉన్న విస్తీర్ణం కంటే కొందరికి తక్కువగా, మరికొందరికి ఎక్కువగా నమోదు చేయడం గమనార్హం. పైగా వ్యాలిడేషన్ ప్రక్రియ అనంతరం జారీ చేయాల్సిన 9(2) నోటీసులను నాలుగు నెలల తర్వాత ఇవ్వడం దుమారం రేపుతుంది. రీసర్వేలో జరిగిన తప్పిదాలతో కంగుతిన్న పలువురు రైతులు బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేయడం గమనార్హం.
సర్వే జరిగిన అయిదు నెలలకు
రీ సర్వేలో ముందుగా గ్రామానికి సరిహద్దులు (ఔటర్ బౌండరీ) నిర్ణయించి, డ్రోన్ ద్వారా ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) సేకరిస్తారు. దీనిపైనే భూములు ఏ ఆకృతిలో ఉన్నాయనేది స్పష్టంగా తెలిసేలా గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తారు. అనంతరం రికార్డులు, వాస్తవంలో ఉన్న హద్దుల ఆధారంగా కొలతలు (వ్యాలిడేషన్) వేసి, రైతులకు 9(2) నోటీసులు ఇవ్వాలి. అభ్యంతరాలేమైనా ఉంటే పరిగణనలో తీసుకొని, ఫాం-31, 32 రూపొందించి వీఆర్వో లాగిన్కు పంపుతారు. అక్కడ రికార్డుల ప్రకారం ఎవరున్నారు, వాస్తవంలో ఎవరి ఆధీనంలో ఉన్నది నిర్ధరించుకొని, ఆ వివరాలతో తహసీల్దార్ స్థాయిలో డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ తయారుచేసి, ఆర్డీవోకు వాటిని నివేదిస్తారు. తుది అంకంలో జేసీ పర్యవేక్షణలో 13 నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఆర్వోఆర్ సిద్ధం చేయాలి. కానీ రంగన్నగూడెంలో వారం క్రితం వరకు రైతులకు 9(2) నోటీసులు ఇవ్వలేదనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. చాలామందికి వారం నుంచే ఈ నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిపై ఈ ఏడాది జులై ఎనిమిదో తేదీ ఉండటం గమనార్హ.
ఇవిగో నిదర్శనాలు..
* కొలుసు సత్యనారాయణ అనే రైతుకు అడంగల్ ప్రకారం ఆర్.ఎస్ నంబర్లు 228/6సి, 228/7, 229/2లలో 2.56 ఎకరాల భూమి ఉంది. ఇటీవల ఇచ్చిన 9(2) నోటీసులో 1.59 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపారు.
* ఆలపాటి సుబ్బారావు అనే కర్షకుడికి ఆర్.ఎస్ నంబర్లు 14/3ఎ, 14/3సిలలో 1.49 ఎకరాలున్నట్లు అడంగల్లో నమోదై ఉంది. 9(2) నోటీసులో 83 సెంట్లు మాత్రమే ఉన్నట్లు నమోదు చేశారు
* చిలకపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఆర్.ఎస్ నంబర్లు 18/1, 18/2లలో 2.37 ఎకరాల భూమి ఉంది. ఆయనకు ఇంతవరకు 9(2) నోటీసు ఇవ్వలేదు.
పక్కాగా జరగలేదు
మా గ్రామంలో రీ సర్వే ప్రక్రియ తూతూ మంత్రంగా చేశారు. సర్వే సమయంలో భూముల వద్దకు వచ్చి సక్రమంగా నిర్ధరించలేదు. ఇప్పటికీ 9(2) నోటీసులు వీఆర్వో వద్దే ఉన్నాయి. రైతు నాయకులు గట్టిగా నిలదీస్తే వారం నుంచి కార్యాలయానికి పిలిచి నోటీసులు ఇస్తున్నారు. దీనిపై తహసీల్దార్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం.
-ఆళ్ల కిశోర్, రైతు
నమోదు కాకుంటే ఎలా?
నా భూములతో పాటు, మా తల్లికి చెందిన పొలం రీ సర్వే తర్వాత కచ్చిత వివరాలు నమోదు చేశారో లేదో అర్థం కావడంలేదు. ఇప్పటివరకు 9(2) నోటీసులు ఇవ్వలేదు. సర్వే మాత్రం తుది దశకు వచ్చిందంటున్నారు. వివరాలేమిటో తెలీదు. విస్తీర్ణం సరిగా నమోదు కాకుంటే అభ్యంతరాలు ఎలా తెలియజేయాలి? ఒకవేళ తెలిపినా ఎంతవరకు సరిదిద్దుతా రనేది ప్రశ్నార్థకంగా ఉంది.
-శ్రీనివాసరావు, కర్షకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
[ 29-03-2024]
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ