వైకాపా నియంతృత్వ పాలన తరిమికొడదాం : దేవినేని
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, దానిని తరిమికొడదామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.
జి.కొండూరులో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం
అందజేస్తున్న ఉమా, రవికుమార్ తదితరులు
జి.కొండూరు, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, దానిని తరిమికొడదామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జి.కొండూరులో శనివారం ఆయన నిరసన ప్రదర్శనలో పాల్గొని స్థానిక సినిమా హాల్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పాలనలో ప్రతిపక్షాలనే కాకుండా మీడియా, న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే స్థితికి వైకాపా నాయకులు తెగించారన్నారు. దళితులు, మహిళలపై హత్యాయత్నాలు, శిరోముండనాలు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా.. దానిని అమలు చేసే నాయకుడు చెడ్డవాడైతే అది చెడ్డ ఫలితాన్నిస్తుందన్నారు. నేటి వైకాపా పాలనే దీనికి నిదర్శనమన్నారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని, నేడు దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేసి, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని నేడు ఇలా మార్చడంతో ప్రజలంతా ‘ఇదేం ఖర్మ.. ఇదేం ప్రభుత్వం’ అని అలోచన చేయాలన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు డిసెంబరు నెల మొత్తం ప్రతి గ్రామంలో నాయకులందరితో కలిసి ‘ఇదేం ఖర్మ.. ఇదేం ప్రభుత్వం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, ఉయ్యూరు వెంకటనరసింహారావు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు పజ్జూరు రవికుమార్, లంకా రామకృష్ణ, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజీనామా చేయకుంటే.. ఊరుకోం..!
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే
[ 20-04-2024]
మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. -
మహా మాయగాళ్లు..!
[ 20-04-2024]
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. -
పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు
[ 20-04-2024]
అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. -
కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ
[ 20-04-2024]
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. -
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
[ 20-04-2024]
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
కోతల జోగి.. చేతలు ఏవీ..?
[ 20-04-2024]
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. -
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.