logo

నడవక తప్పలేదు..!

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Published : 27 Nov 2022 05:12 IST

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా పోలీసులు కళాక్షేత్రం వైపు ఉన్న రహదారితో పాటు, పాత ప్రభుత్వాసుపత్రి రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే ప్రయాణికులు ఇలా లగేజీతో, పిల్లలతో, గర్భిణులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడ్డారు. నడవలేక పిల్లలు ఎత్తుకోమని ఏడుస్తుంటే ఓ తల్లి దండించిన సంఘటన కూడా చోటుచేసుకుంది.

ఈనాడు, విజయవాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని