నేతల సంకల్పసిద్ధి..!
కొత్త సంస్థ.. వ్యాపార అనుభవం లేదు.. కానీ ఆరు నెలలు.. మూడు రాష్ట్రాలు.. దాదాపు 20వేల మంది సభ్యులు.. రూ.250 కోట్లు వసూలు.. కార్యాలయాలు లేవు.. ప్రచారం లేదు.. ఎలా సాధ్యం..? ఇవి పోలీసు లెక్కలు.
సిఫార్సులతోనే రూ.వందల కోట్లు సేకరణ
ఈనాడు, అమరావతి
కొత్త సంస్థ.. వ్యాపార అనుభవం లేదు.. కానీ ఆరు నెలలు.. మూడు రాష్ట్రాలు.. దాదాపు 20వేల మంది సభ్యులు.. రూ.250 కోట్లు వసూలు.. కార్యాలయాలు లేవు.. ప్రచారం లేదు.. ఎలా సాధ్యం..? ఇవి పోలీసు లెక్కలు. అనధికారికంగా 25వేల మంది పైగా సభ్యులు.. సుమారు రూ.500 కోట్ల పైగా వసూలు అంచనా. దీని వెనుక సూత్రధారులు ఎవరు..? పది నెలల్లో సొమ్మును ఆరు రెట్లు చేస్తామని భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించిన సంకల్పసిద్ధి సంస్థ వెనుక భారీ తలకాయలే ఉన్నట్లు తెలిసింది. దీని అసలు సూత్రధారులు ఎన్నికలే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది పెద్దలకు ముందస్తు సమాచారం ఇచ్చి వారి అనుమతితో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మరో ఆగ్రిగోల్డ్ తరహాలో భారీ ఎత్తున వసూలు చేసి.. కొంత మొత్తాలను తిరిగి ఖాతాదారులకు చెల్లింపులు జరిపి మంచిపేరు సంపాదించాలనే పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అసలు సూత్రధారులను వెలుగులోకి రానీయకుండా కాపాడేందుకు ఉన్నత స్థాయిలోనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ కేసును కొలిక్కి తెస్తామని చెబుతున్న పోలీసులు, మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం కిందనే జమ కట్టనున్నారు.
గన్నవరం, గుడివాడలతో మొదలు..
కొంతమంది కీలక నేతలు తమ అనుచరులకు, ప్రజాప్రతినిధులకు సిఫార్సులు చేయడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆర్థికంగా ఉన్నవారిని గుర్తించి పెట్టుబడి పెట్టించినట్లు తెలిసింది. కొంతమంది వ్యాపారులు ఖాతాదారులుగా చేరారు. ప్రస్తుతం వారు పోలీసుల ముందుకు రావడానికి ఇష్టపడటంలేదు.కేవలం రూ.10వేలు నుంచి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టిన వారే పోలీసుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది మే 17న సంస్థ గన్నవరం కేంద్రంగా ఆవిర్భవించింది. గుత్తా వేణుగోపాల్కృష్ణ, ఆయన కుమారులు ఎండీ, డైరెక్టర్లుగా ఉన్నారు. వీరి ఆర్థిక పరిస్థితి నామమాత్రమే. దీనికి సూత్రధారులు వేరే ఉన్నట్లు సమాచారం. గన్నవరం, గుడివాడల్లో మొదట కార్యాలయాలు ఏర్పాటు చేశారు. తర్వాత విజయవాడ, ఇతర ప్రాంతాలకు విస్తరించారు. నిడమానూరులో డమ్మీ ఈ మార్టు ఏర్పాటు చేశారు.
ఉద్యోగుల విచారణ!
సంకల్పసిద్ధి సంస్థ డమ్మీ ఈ మార్ట్లను విజయవాడలోని దుర్గాగ్రహారం, నిడమానూరులో ఏర్పాటు చేసింది. ఇక్కడ నియమించిన సిబ్బందిని పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి విచారణ చేస్తున్నారు. వారి కుటుంబీకులను తీసుకువచ్చినట్లు తెలిసింది. వీరంతా రూ.10వేలు, రూ.15వేల వేతనానికి కుదిరిన సిబ్బంది. తమకు వివరాలు తెలియవని చెబుతున్నారు.
ఎన్నికల ఫండ్ కోసం..!
ఈ సంస్థ ముందుగానే బోర్డు తిప్పేయాలని ప్రణాళికతోనే ఏర్పాటు చేశారని తెలిసింది. భారీ ఎత్తున సేకరించిన నిధులు ఎన్నికల ఫండ్కు వనియోగించాలనేది వ్యూహం. ఖాతాదారుల్లో తిరుగుబాటు వచ్చేనాటికి బోర్డు తిప్పేయాలనేది ముందస్తు వ్యూహంగా కనిపిస్తోంది.
సీఐడీ ఏదీ..?
సాధారణంగా మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాల కేసులను సీఐడీ విచారిస్తుంది. కానీ ఈ కేసును విజయవాడ నగర పోలీసుల పరిధిలో సైబర్ క్రైం, టాస్క్ఫోర్సు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏ విషయం బహిర్గతం కానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సంస్థ డిపాజిట్ల సేకరణ ముందుగానే సీఐడీలో ఓ కీలక అధికారికి సమాచారం ఉందని, ఆయన వేణుగోపాలకృష్ణను విచారించి వదిలేశారనే ప్రచారం జరుగుతోంది. దీని వెనుక భారీగానే డీల్ ఉందని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తుపై విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో కేసు కొలిక్కి వస్తుందని వివరించారు. మీడియా ఊహాగానాలు రాస్తోందని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్