logo

కాల్వలో పడి చిన్నారి మృతి

బంధువుల ఇంటికి వచ్చిన ఓ బాలిక ప్రమాదవశాత్తు బందరుకాల్వలో పడి ప్రాణాలు కోల్పోయింది.

Published : 27 Nov 2022 05:12 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: బంధువుల ఇంటికి వచ్చిన ఓ బాలిక ప్రమాదవశాత్తు బందరుకాల్వలో పడి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. గన్నవరం సమీపంలో బీబీగూడెంకు చెందిన హెప్సిబా.. తన కుమార్తె సాయిల మిస్సీప్రియ(7)తో  కలిసి శుక్రవారం తాడిగడపలోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం వేకువజామున బందరు కాల్వ ఒడ్డున వీరిద్దరూ  కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లగా మిస్సీప్రియ ప్రమాదవశాత్తు కాలు జారి బందరు కాల్వలో పడి కొట్టుకుపోయింది. పాప మృతదేహం పెనమలూరు వంతెన వద్ద చెట్లకు చిక్కుకుపోవడంతో స్థానికులు పెనమలూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని