సంచుల కొరత.. అన్నదాత కలత
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన వరి పంటను విక్రయించేందుకు రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు
ఆరబెట్టుకునేందుకు అవస్థలు పడుతున్న వైనం
కూచిపూడి, న్యూస్టుడే: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన వరి పంటను విక్రయించేందుకు రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సంచుల కొరతతోపాటు మిల్లర్లకు ధాన్యం తోలేందుకు లారీలు రాక బస్తాల వద్ద రైతులు నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొవ్వ మండలంలో దాదాపు 30 వేల ఎకరాల్లో వరి వేశారు. విపత్తులను అధిగమించి చేతికందిన పంట అమ్ముకునేందుకు ఆర్బీకేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ప్రభుత్వ ఆదేశాలు ఆచరణలో ఎండమావిగానే ఉన్నాయంటున్నారు అన్నదాతలు. యంత్రాల ద్వారా నూర్పిడి చేసుకున్న ధాన్యాన్ని ట్రాక్టర్లపై తీసుకొచ్చి ఇళ్లలో, ఖాళీ ప్రదేశాల్లో పోసుకొని ఆరబెట్టుకోవడంలో తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం నూర్పిడులను ఆపేసి.. ఇప్పటికే నూర్చిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు సంచుల కోసం నిత్యం ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నారు. మొవ్వ మండలంలో 16 ఆర్బీకేలు ఉండగా తొలిగా 10 కేంద్రాల్లో వారం రోజుల కిందట ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ఇప్పటికే 170 మంది రైతులు 13,265 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించగా నాలుగు రోజులుగా సంచుల కొరతతో కొనుగోళ్లు నిలచిపోయాయి. మొవ్వ మండలంలో 21 పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల్లో పలువురు రైతులు తమ ధాన్యాన్ని రాశులుగా పోసి ప్రభుత్వం నుంచి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు.
గోనె సంచుల కోసం నాలుగు రోజులు నిరీక్షించినా ఫలితం లేక పెడసనగల్లులో ధాన్యం ఆరబెట్టుకున్న కౌలు రైతు పామర్తి వెంకటేశ్వరరావు
గతిలేక ఆరబెట్టుకున్నాం
- వీరపనేని చంద్రశేఖరరరావు, రైతు
ఆర్బీకేల్లో సంచుల కొరత ఉంది. ఏ మిల్లర్ దగ్గరకు వెళ్లినా కొనుగోలు చేయడం లేదు. గతిలేక ఆరబెట్టుకున్నాము. తేమ శాతం ఎక్కువగా ఉంటే డబ్బులు తగ్గించి ఇవ్వమన్నా ఎవరూ ముందుకు రావటం లేదు. 887 బస్తాలు గంగానమ్మ గుడి ఆవరణలో, పొలం గట్లపై ఆరబోసుకున్నాను. గ్రేడ్తో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఆన్లైన్లో 1061 రకం అని నమోదు చేయించుకోవడంతో మీపేరు తీసుకోవడం లేదని చెబుతున్నారు.
20 వేల సంచులు కావాలి
- గొట్టిపాటి రామమోహనరావు
50 ఎకరాల్లో యంత్రంతో కోతలు ప్రారంభించాం. 12 ఎకరాల్లో పూర్తయింది. గోనె సంచుల కోసం ఆర్బీకేకు వెళితే లేవంటున్నారు. దీంతో నాలుగు రోజులుగా తమ ఇంటి పరిసరాల్లో ధాన్యం ఆరబెట్టుకొని ఎదురు చూస్తున్నాం. మాతోపాటు గొట్టిపాటి శివరామప్రసాద్ కూడా 50 ఎకరాల్లో పంట కోసి సంచుల కోసం చూస్తున్నారు. ఒక్క భట్లపెనుమర్రులోనే ఇంతవరకూ కోసిన ధాన్యానికి 20 వేల సంచులు అవసరం.
ఇండెంట్ పంపాం
- వీరాంజనేయప్రసాద్, తహసీల్దారు
31 వేల సంచుల కోసం ఇండెంట్ పంపాము. రాగానే రైతులకు అందిస్తాం. రవాణా విషయంలో లారీలు రాక ఆలశ్యమవుతుంది. సంబంధిత రైతులు వారికి కేటాయించిన మిల్లుకు సొంత వాహనంపై తోలుకుంటే కిరాయి రైతు ఖాతాలో జమ చేస్తాం. గతంలో ఎ, బి గ్రేడ్లుగా ధాన్యాన్ని కొనుగోలు చేసేవారం. ఇప్పుడు ఒకటే గ్రేడ్గా కొంటూ తేమ శాతం ఆధారంగా నగదు జమ చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
[ 20-04-2024]
మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. -
మహా మాయగాళ్లు..!
[ 20-04-2024]
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. -
పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు
[ 20-04-2024]
అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. -
కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ
[ 20-04-2024]
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. -
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
[ 20-04-2024]
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
కోతల జోగి.. చేతలు ఏవీ..?
[ 20-04-2024]
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. -
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం