logo

సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన

మండల పరిధిలోని మెరకనపల్లి పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు శంకుస్థాపన చేశారు. 

Updated : 28 Nov 2022 14:07 IST

మోపిదేవి : మండల పరిధిలోని మెరకనపల్లి పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు శంకుస్థాపన చేశారు. రూ.40 లక్షలతో సచివాలయ భవనం, రూ.21 లక్షలతో నిర్మించనున్న ఆరోగ్య ఉప కేంద్రానికి భూమి పూజ చేశారు. సర్పంచి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం జగన్‌.. వాలంటీర్లు, సచివాలయాల ద్వారా ప్రజలకు వద్దకే ప్రభుత్వ సేవలు తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామకోటేశ్వరరావు, ఎంపీడీవో పార్వతి, వైకాపా నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని