logo

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మార్గశిర షష్ఠి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Updated : 28 Nov 2022 14:08 IST

మోపిదేవి :  ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మార్గశిర షష్ఠి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత స్వామివారిని పెళ్లికుమారుడిగా అలంకరించారు. దేవాదాయ, చల్లపల్లి ఎస్టేట్‌ దేవాలయాల వంశీయులు అందించిన పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించేందుకు ఆలయ సహాయ కమిషనర్‌ చక్రధరరావు, ఆలయ ప్రధాన అర్చకులు పవన్‌కుమార్‌ శర్మకు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది, వేద పండితులు, ఆలయ అర్చకులు, భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం స్వామివారి కల్యాణోత్సవం, బుధవారం గ్రామోత్సవం నిర్వహిస్తామని చక్రధరరావు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని