సహకారం సరే... జవాబుదారీ ఎవరు?
ధాన్యం విక్రయాల్లో విధించిన నిబంధనల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. వీరితోపాటు సహకారసంఘ ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీఎస్ఏ బాధ్యతపై పీఏసీఎస్ల్లో విముఖత
కలెక్టరేట్(మచిలీపట్నం),గొడుగుపేట,న్యూస్టుడే
ధాన్యం విక్రయాల్లో విధించిన నిబంధనల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. వీరితోపాటు సహకారసంఘ ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఏంచేయాలో తెలియక తలలుపట్టుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కీలక బాధ్యతను ప్రాథమిక సహకారం సంఘా(పీఏసీఎస్)లకు అప్పగించడం, ప్రస్తుతం సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భద్రత లేనివారితో ఎంతవరకు భరోసా?
గతంలో వ్యవసాయ, సహకార సంఘాల ఆధ్వర్యాన ధాన్యం కొనుగోళ్లు చేసేవారు. రెండు శాఖల్లోని ఉద్యోగులకు సాంకేతికంగా అవగాహన ఉండటం వల్ల అంతగా ఇబ్బందులు ఉండేవి కావు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో రైతుల అమ్మే ధాన్యాన్ని తగు భరోసా ఉండేది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఆర్బీకేల ద్వారా ధాన్యం కోనుగోళ్ల విషయంలో సపోర్టింగ్ ఏజెన్సీ(పీఎస్ఏ)గా వలంటీర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు బాధ్యతలు కేటాయించిన ప్రభుత్వం ఏజెన్సీ నిర్వహణ అంశాన్ని సహకార సంఘాలకు కేటాయించింది. ధాన్యం నమూనాల సేకరణ నుంచి మిల్లర్లకు చేర్చే వరకూ బాధ్యత తీసుకోవాల్సిన వాలంటీర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఏమేరకు జవాబుదారీగా ఉంటారన్న అనుమానాలు సంఘాల పాలకవర్గాలతో పాటు రైతుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ఉద్యోగ భద్రత లేని వాలంటీర్లు, తాత్కాలిక పద్ధతిపై తీసుకునే టెక్నికల్ అసిస్టెంట్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే తలెత్తే పరిణామాలకు ఎవరిని బాధ్యులు చేస్తారన్న పశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో తాత్కాలిక పద్ధతిపై టెక్నికల్ అసిస్టెంట్లు, వాలంటీర్లకు సహాయకులను ఆయా పీఏసీఎస్ అధికారులు నియమించారు. సాంకేతికపరమైన అనుభవం లేని టెక్నికల్ అసిస్టెంట్ల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీకేలు, సచివాలయాల్లో అనుభవం ఉన్న వారిని నియమించాలని పీఏసీఎస్ సీఈవోలు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్ధికపర సమస్యలతో ఆందోళన
ఉమ్మడి జిల్లాలో దాదాపు 425 వరకూ ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా వాటిలో యాభైశాతం వరకూ నష్టాల్లోనే ఉన్నాయి. సంఘ లాభాల నుంచి అందులో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా చాలా వరకూ సంఘాల్లో సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితి కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నాలుగు సంవత్సరాలుగా ఇవ్వాల్సిన కమిషన్ రమారమి రూ.5.00 కోట్ల వరకూ సంఘాలకు జమచేయలేదు. దీనికి తోడు 2021 మార్చి తర్వాత కొనుగోలు చేసిన ధాన్యం తాలూకా హమాలీ ఛార్జీలు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ బకాయిలతో చాలా సంఘాలు లోటు బడ్జెట్లోకి వెళ్లి పోవడంతో ఆడిట్ అభ్యంతరాలతో పాటు సిబ్బందికి వేతన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఖరీఫ్కు హమాలీ ఛార్జీలు చెల్లించడం, టెక్నికల్ అసిస్టెంట్లు, వాలంటీర్ల సహాయకులకు గౌరవ వేతనాలు చెల్లించడం సంఘాలకు సమస్యాత్మకం కానుంది. ప్రభుత్వం బస్తాకు రూ.10 చొప్పున ఇచ్చే హమాలీ ఛార్జీలకు ఎవరూ ముందుకు రావడం లేదు. సేకరణ లక్ష్యంలో వెనుకబాటులో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంతో హమాలీలకు ఇచ్చే అదనపు కూలీని కొన్ని సంఘాలే భరించాల్సి వస్తోంది. ధాన్యం రవాణాకు సంబంధించి వాహనాన్ని రెండు సార్లు వేబ్రిడ్జిలో కాటా వేయించేందుకు ఒక్కో వాహనానికి సగటున రూ.250 వరకూ ఖర్చవుతుంది. ఈ ఖర్చు ఎవరు భరించాలన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆ భారం పీఏసీఎస్లే భరించకతప్పదు.
సగానికి పైగా సంఘాల్లో నెలనెలా సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో ధాన్యం సేకరించేందుకు నియమించిన టెక్నికల్ అసిస్టెంట్లు, వాలంటీర్లకు సహాయకులకు వేతనాలు చెల్లించాల్సి రావడాన్ని సంఘ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. కేవలం తాము సహకారం మాత్రమే అందించగలమని, ఇతరత్రా ఆర్ధిక భారాలతో పాటు కొనుగోలు సిబ్బంది వైఫల్యాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేస్తూ ఉన్నతాధికారులకు అర్జీలు కూడా సమర్పించారు.తమకు వెసులుబాటు కల్పించడంతో పాటు రైతు ప్రయోజనాలు పరిరక్షించేలా అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు పీఏసీఎస్ సీఈవోలు జిల్లా ఉన్నతాధికారులకు అర్జీలు సమర్పించారు. ఇప్పటికైనా స్పందించి తమకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
[ 29-03-2024]
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
[ 29-03-2024]
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి