logo

ఫులే ఆశయ సాధనకు కృషి చేద్దాం

మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా కోరారు. ఫులే వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Published : 29 Nov 2022 05:21 IST

జ్యోతిరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా కోరారు. ఫులే వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కులాల పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఫులే అని కొనియాడారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి స్ఫూర్తిప్రదాతగా నిలిచారన్నారు. జేసీ మహేష్‌కుమార్‌, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సరస్వతి, పలువురు సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు