logo

వృత్తిపై నిబద్ధతే గుర్తింపునకు గీటురాయి

ఏ ఉద్యోగికి అయినా వృత్తిపై చూపే నిబద్ధతే ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయేలా చేస్తుందని కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు.

Published : 01 Dec 2022 06:12 IST

జేసీ మహేష్‌కుమార్‌కు జ్ఞాపిక అందజేస్తున్న డీఆర్వో, జిల్లా అధికారులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఏ ఉద్యోగికి అయినా వృత్తిపై చూపే నిబద్ధతే ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయేలా చేస్తుందని కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు. బదిలీపై వెళ్తున్న జేసీ మహేష్‌కుమార్‌కు జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం వీడ్కోలు పలికారు. కలెక్టర్‌తో పాటు నూతన జేసీ అపరాజితసింగ్‌, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన అనంతరం తాను, మహేష్‌కుమార్‌ జిల్లాలో ఒకే రోజు విధుల్లో చేరామన్నారు. ఎనిమిది నెలల వ్యవధిలో ఆయన ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని ప్రశంసించారు. నూతన జేసీ అపరాజితసింగ్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, పలువురు అధికారులు మహేష్‌కుమార్‌ను సత్కరించి ఆయనతో తమకున్న అనుభవాలు పంచుకున్నారు. సన్మాన గ్రహీత జేసీ మాట్లాడుతూ తన పదవీ కాలంలో అందరూ చక్కని సహకారం అందించారని చెబుతూ ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని