Vijayawada: ఆమెది ఆర్ఎంపీ అవతారం.. చేయించేది వ్యభిచారం!
ఆమె చుట్టు పక్కల వారు, తెలిసిన వారి దృష్టిలో ఆర్ఎంపీ. చికిత్స చేస్తున్నట్లు వైద్య సలహాలు ఇస్తుంటుంది. చేసేది మాత్రం వ్యభిచార గృహ నిర్వహణ.
భవానీపురం, న్యూస్టుడే : ఆమె చుట్టు పక్కల వారు, తెలిసిన వారి దృష్టిలో ఆర్ఎంపీ. చికిత్స చేస్తున్నట్లు వైద్య సలహాలు ఇస్తుంటుంది. చేసేది మాత్రం వ్యభిచార గృహ నిర్వహణ. వివిధ ప్రాంతాల నుంచి యువతులను నగరానికి రప్పించి వ్యభిచారం చేయిస్తుంది. సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు వలపన్ని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. భవానీపురం ప్రాంతంలో మహిళ నివాసం ఉంటోంది. భర్త ఆర్ఎంపీగా పని చేస్తూ కొవిడ్ సమయంలో చనిపోయారు. అప్పటి నుంచి ఆమె ఆర్ఎంపీగా అవతారం ఎత్తి వైద్యం చేయటం, ఇంటి వద్దకు వచ్చిన వారికి సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. ఎవరైనా ఆమెకు దగ్గరైతే తన వద్ద యువతులు ఉన్నారంటూ చెబుతుంది. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల నుంచి ఆమె అమ్మాయిలను రప్పిస్తుంది. ఆమె చేస్తున్న వ్యాపారం భవానీపురం సీఐ ఉమర్ దృష్టికి వెళ్లింది. అనంతరం యువకుడితో గత నెల 30వ తేదీన ఆమె వాట్సాప్కు సందేశం పంపారు. తనకు అమ్మాయి కావాలంటూ ఆ యువకుడు కోరాడు. యువతి వద్దకు వెళ్లాలంటే రూ.10వేలు అని ఆమె చెప్పింది.
ముందు తనకు రూ.5వేలు ఇవ్వాలని, మరో రూ.5 వేలు గదిలోకి వెళ్లిన తరువాత అమ్మాయికి ఇవ్వాలంటూ చెప్పింది. ఆ యువకుడిని గొల్లపూడి హైస్కూలు వద్దకు రావాలంటూ చెప్పగా వెళ్లాడు. అక్కడ ఆమెకు అతడు రూ.5 వేలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులు సమీపంలోని హోటల్లో ఉన్న యువతికి ఇవ్వాలంటూ గది నంబరు చెప్పింది. సమీపంలోనే ఉన్న భవానీపురం పోలీసులు నిర్వాహకురాలిని అరెస్టు చేశారు. గదిలో ఉన్న యువతిని విచారించగా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు చెప్పింది. ఆమెను వసతి గృహానికి తరలించారు. భవానీపురం సీఐ ఉమర్ కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్