కట్టుకుంటారా... లాక్కోమంటారా?
అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలం, పక్కా ఇల్లు సమకూర్చేందుకే నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం చేపట్టామని చెప్పిన వైకాపా ప్రభుత్వం 2020 డిసెంబరు నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టింది.
ఇళ్లు నిర్మించకుంటే స్థలం తీసేసుకుంటాం
జగనన్న కాలనీ లబ్ధిదారులకు తాఖీదులు
బాపులపాడు మండలం కానుమోలు లేఔట్ దుస్థితి
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే: అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలం, పక్కా ఇల్లు సమకూర్చేందుకే నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం చేపట్టామని చెప్పిన వైకాపా ప్రభుత్వం 2020 డిసెంబరు నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 1,508 లేఔట్లలో దాదాపు 3.31 లక్షల మందికి స్థలాలు మంజూరు చేసింది. జగనన్న కాలనీల పేరిట వాటిని అభివృద్ధి చేస్తామని చెప్పి అరకొరగా పనులు ప్రారంభించింది. నేటికీ అవి కొలిక్కి రాలేదు. చాలా లేఔట్లకు సామగ్రి తీసుకెళ్లేందుకు సరైన రహదారులు లేని దుస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన స్థలంలో ఇళ్లు నిర్మించకుంటే పట్టా రద్దు చేసి, వేరే వారికి ఆ స్థలం ఇచ్చేస్తామంటూ అధికారులు తాఖీదులు ఇస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వసతుల్లేకుండా ఎలా?
బాపులపాడు మండలం కానుమోలులో రెండు చోట్ల వేర్వేరుగా లేఔట్లు వేసి 86 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఆ రెండు లేఔట్లకు ఇప్పటివరకు అప్రోచ్ రోడ్డు కూడా నిర్మించలేదు. ఇక అంతర్గత రహదారుల సంగతి సరే సరి. విద్యుత్తు లైన్లు సైతం వేయలేదు. వర్షం వస్తే మునిగిపోయే ఈ జగనన్న కాలనీల్లో అధికారుల ఒత్తిడితో 16 మంది నిర్మాణాలు ప్రారంభించారు. ఒక ఇల్లు పూర్తయినా నివాసం ఉండేందుకు కాలనీ అనువుగా లేని కారణంగా లబ్ధిదారు అద్దె ఇంటిలోనే ఉంటున్నారు. ఈ తరహా ఉదంతాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.
రెండేళ్లవుతున్నా అభివృద్ధి ఏదీ..?
ఇళ్ల స్థలాలు ఇచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా నేటికీ లేఔట్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదు. అనేక చోట్ల విద్యుత్తు, కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. కేవలం బోర్లు మాత్రమే వేశారు. అంతర్గత రహదారులను విడగొట్టి, వాటిని రాకపోకలకు అనువుగా అభివృద్ధి చేయలేదు. మురుగు పోయేందుకు కచ్చా కాల్వలు కూడా తవ్వలేదు. ఇవేమీ చేయకుండా ఇళ్లు కట్టకపోతే స్థలం తీసేసుకుంటామంటూ తాఖీదులు జారీ చేయడంపై లబ్ధిదార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సామగ్రి వెళ్లడమే కష్టం..
కాలనీల్లో వసతులు, సదుపాయాల సంగతి ఎలా ఉన్నా, ముందుగా ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక, కంకర, ఇతరత్ర సామగ్రి తీసుకెళ్లేందుకు రెండు జిల్లాల పరిధిలో సగానికి పైగా లేఔట్లకు సరైన దారి లేకుండా పోయింది. చాలా చోట్ల ట్రాక్టర్లు దిగబడిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని కాలనీల్లో ఇళ్లు కట్టే ప్రదేశానికి సామగ్రి వెళ్లే వీల్లేక అర కి.మీ. దూరం నుంచి లబ్ధిదారులే మోసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి
మూడొంతులు బేస్మెంట్లోనే..
కృష్ణా జిల్లాకు 84,614, ఎన్టీఆర్ జిల్లాకు 83,633 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిల్లో కేవలం 6,959 ఇళ్లు మాత్రమే పూర్తయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు జిల్లాల పరిధిలో 1,03,965 ఇళ్లు నేటికీ బేస్మెంట్ స్థాయికి దిగువనే ఉండటం గమనార్హం. నిర్మాణాలు చేపట్టకుంటే స్థలం లాగేసుకుంటారనే భయంతో లబ్ధిదార్లు బేస్మెంట్ వరకే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదనే ఉద్దేశంతో 90 శాతం లభ్ధిదార్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలనే ఆప్షన్ని ఎంచుకోవడంతో నిర్మాణాలు మందగమనంలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వసతుల లేమి, పెరిగిన నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా కడతారా, స్థలం వేరేవారికి ఇచ్చేయమంటారా అంటూ అధికారులు లిఖిత పూర్వక బెదిరింపులకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి