దివ్యాంగులకూ రైల్వే పెద్ద పీట
దివ్యాంగులకు పెద్దపీట వేస్తూ రైల్వే శాఖ ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది. గతంతో పోలిస్తే రెట్టింపు సౌకర్యాలు సమకూరాయి.
ప్రత్యేక బోగీలు, బుకింగ్ కౌంటర్ల ఏర్పాటు
నేడు రాయితీ కార్డుల పంపిణీ
దివ్యాంగుడిని కుర్చీలో తరలిస్తున్న లైసెన్స్ పోర్టర్
రైల్వేస్టేషన్(విజయవాడ), న్యూస్టుడే: దివ్యాంగులకు పెద్దపీట వేస్తూ రైల్వే శాఖ ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది. గతంతో పోలిస్తే రెట్టింపు సౌకర్యాలు సమకూరాయి. విజయవాడ రైల్వేస్టేషన్తో పాటు డివిజన్ వ్యాప్తంగా అన్ని ప్రధాన స్టేషన్లలో కొత్తగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. స్టేషన్ డైరెక్టర్ ప్రసాద్ ఎప్పటికప్పుడు సౌకర్యాలను పరిశీలిస్తున్నారు.
బోగీల్లో ప్రవేశిస్తే కేసులు..
అన్ని మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో గార్డు బోగీ పక్కన దివ్యాంగుల కోసం ప్రత్యేక డిజైన్తో రైల్వే శాఖ బోగీ ఏర్పాటు చేసింది. వాటిలో దివ్యాంగులు తప్ప ఎవరూ ప్రయాణించకూడదు. దీన్ని అతిక్రమిస్తే ఆర్పీఎఫ్ పోలీసులు కేసులు నమోదు చేస్తారు. అలాగే వారితో పాటు రైల్లో ప్రయాణించే సహాయకుడికి కూడా ప్రత్యేక కోటాలో బెర్తు కేటాయిస్తారు. ప్రతి రైల్లో 4 నుంచి 6 బెర్తుల వరకు ప్రత్యేకంగా కేటాయించారు. రైల్వే రిజర్వేషన్ కేంద్రాలతో పాటు ఐఆర్సీటీసీలోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రధాన ముఖద్వారం వద్ద నిర్మించిన ర్యాంప్
స్టేషన్లో సౌకర్యాలు ఇలా..
విజయవాడ రైల్వేస్టేషన్లోని ఒకటో నంబరు ప్లాట్ఫాం, తారాపేట, పార్సిల్ బుకింగ్ తదితర ప్రధాన మార్గాల్లో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేసి దివ్యాంగుల కోసం వీల్ఛైర్లు 24 గంటలూ అందుబాటులో ఉంచారు. దీని కోసం ఆయా మార్గాల్లో లైసెన్స్ పోర్టర్ల ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఏ సమయంలో ఫోన్ చేసినా వారు నేరుగా రైలు వద్దకు తీసుకెళ్తారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ‘ఈ వీల్ఛైర్’ సౌకర్యం అందుబాటులో ఉంది. రిజర్వేషన్ పీఎన్ఆర్ నంబరు నమోదు చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. రిజర్వేషన్ కార్యాలయం, జనరల్ బుకింగ్ కేంద్రాల వద్ద కూడా దివ్యాంగుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. ఒకటో నంబరు ప్లాట్ఫాంపై ప్రత్యేక డిజైన్తో మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. నీళ్లు పట్టుకునేందుకు వీలుగా అన్ని ప్లాట్ఫారాల్లోని కుళాయిలు కూడా తక్కువ ఎత్తులో పూర్తి వైకల్యం ఉన్న వారికి కూడా సౌకర్యంగా ఉండేలా నిర్మించారు. అన్ని ప్లాట్ఫారాల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు అందుబాటుకి తెచ్చారు. లిఫ్టులను ఎవరి సహాయం లేకుండా ఉపయోగించేలా ప్రత్యేక బటన్లు ఏర్పాటు చేశారు.
రిజర్వేషన్ వసతి
దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపొందించిన రైల్వే రాయితీ కార్డులను శనివారం రైల్వే అధికారులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డుల సహాయంతో రైల్వే రిజర్వేషన్ కేంద్రాలతో పాటు ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా కూడా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
[ 24-04-2024]
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
[ 24-04-2024]
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అంటకాగితే.. అంతే రాణా..!
[ 24-04-2024]
అధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.