logo

చంద్రన్న పాలన కోసం ప్రజల ఎదురుచూపు : మండలి

చంద్రబాబు నాయుడు పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని,  రాష్ట్రంలో ఇదేం పాలన, ఇదేం ఖర్మ అని ప్రజలంటున్నారని మాజీ  ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

Published : 03 Dec 2022 04:52 IST

వేకనూరులో మాట్లాడుతున్న బుద్ధప్రసాద్‌

మోదుమూడి(అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: చంద్రబాబు నాయుడు పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని,  రాష్ట్రంలో ఇదేం పాలన, ఇదేం ఖర్మ అని ప్రజలంటున్నారని మాజీ  ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. వేకనూరులో తెదేపా చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని శుక్రవారం  ఆయన ప్రారంభించారు. వైకాపా పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీ లబ్ధిదారులు తమ సమస్యలను బుద్ధప్రసాద్‌కు వివరించారు. మోదుమూడి ఎస్సీ కాలనీలోని కూర్చున్న అంబేడ్కర్‌  విగ్రహానికి బుద్ధప్రసాద్‌ పూలదండలు వేసి నివాళులు అర్పించారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని