శ్రద్ధపెట్టు.. ఉపకార వేతనం పట్టు
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుతున్నారు.
ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు
వేలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయిని
విజయవాడ సిటీ, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుతున్నారు. వీరి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఏటా 8వ తరగతి విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేలు చొప్పన వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఈ ఏడాది పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో పరీక్ష జరగనుంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 323 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది మరింత మంది ఎంపికవ్వాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ ఇస్తున్నారు. గత నాలుగేళ్లగా పరిశీలిస్తే దరఖాస్తులు వేలల్లో ఉంటే కేవలం వందల్లోనే అర్హత సాధిస్తున్నారు. పరీక్షకు మరో రెండు నెలలు సమయం ఉండడంతో ప్రత్యేక శ్రద్ధ పెడితే విజయం సాధించడం సులభమేనని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
180 మార్కులకు పరీక్ష
పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. మొదట పేపరులో అభ్యర్థుల సామర్ధ్యాన్ని అంచనా వేసే మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్పై ప్రశ్నలు ఉంటాయి. రెండోది ఆప్టిట్యూడ్ పరీక్ష. ఇందులో 7, 8 తరగతులకు సంబంధించి జనరల్ సైన్సు, సోషల్, గణితానికి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
అన్ని అంశాలపై అవగాహన అవసరం
పాఠశాల స్థాయిలోనే విద్యార్థి సామర్ధ్యాలను వెలికితీయడానికి ఈ పరీక్ష ఎంతో ఉపయోగపడుతోంది. ఏడు, ఎనిమిది తరగతుల్లోని సైన్స్, సోషల్, గణితం పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. కేవలం ముఖ్యమైన వాటికే పరిమితం కాకుండా అన్ని అంశాల పై పూర్తి పట్టు సాధించాలి. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ కూడా నేర్చుకోవాలి. ప్రతి రోజూ మూడు గంటలు కేటాయించి సాధన చేస్తే కచ్చితంగా విజయం సాధించొచ్చు. సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి. ప్రత్యేక తరగతులు కూడా ఎంతో దోహదపడతాయి. - ఎల్.ఉమాదేవి, ఉపాధ్యాయురాలు
ప్రణాళిక బద్ధంగా..
ఎన్ఎంఎంఎస్లో అర్హత సాధించాలనేది లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళిక బద్ధంగా చదివా. సందేహాలను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవడం, ఎనిమిదో తరగతిలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం ఎంతో ఉపయోగపడింది. తొమ్మిదో తరగతి నుంచి ఉపకారవేతనం వస్తోంది. తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా విద్యాపరమైన అంశాలకు ఈ నగదును వినియోగిస్తున్నా.
ఎం.నిహారిక, పదో తరగతి, జీడీఈటీ ఎంసీహైస్కూల్, పటమట
కష్టపడాలి.. అర్హత సాధించాలి
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటిని మరింత మంది సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని దరఖాస్తు చేయించారు. ఎక్కువ మంది ఎంపికవ్వాలని ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి.
సి.వి.రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ