రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడకు నేడు రానున్నారు. ఏపీ సర్కారు నిర్వహించే పౌరసన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి నేడు పాల్గొననున్నారు.
పోరంకిలో పౌరసన్మాన కార్యక్రమం
విజయవాడలో ట్రాఫిక్ మార్పులు
సభా వేదిక వద్ద ఏర్పాట్లు
ఈనాడు, అమరావతి - గన్నవరం గ్రామీణం, పోరంకి, న్యూస్టుడే: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడకు నేడు రానున్నారు. ఏపీ సర్కారు నిర్వహించే పౌరసన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి నేడు పాల్గొననున్నారు. దిల్లీ నుంచి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తారు. ఉదయం 10.15గంటలకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తొలుత విజయవాడలోని రాజ్భవన్కు వెళ్తారు. అక్కడ ప్రముఖల స్వాగతం అనంతరం.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో జరిగే పౌరసన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. కార్యక్రమం తర్వాత తిరిగి రాజ్భవన్కు చేరుకుంటారు. గవర్నర్ ఇచ్చే విందులో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 02.15గంటలకు రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకుని.. ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వరకూ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం పరిసరాల్లోనే సుమారు 800మంది పోలీసులను భద్రత కోసం ఉంచారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రతాలోపాలు తలెత్తకుండా శనివారం ట్రయల్రన్ను నిర్వహించారు. రాష్ట్రపతికి గౌరవ వందనం చేసేందుకు ముందస్తుగా పోలీసులు శనివారం సాధన చేశారు. ఎస్పీ జాషువా, పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వరకూ జాతీయ రహదారిని సుందరంగా తీర్చిదిద్దారు.
వాహనాల మళ్లింపులు..
విజయవాడకు వచ్చే వాహనాలను ఆదివారం మళ్లిస్తున్నట్టు సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు. బీ విశాఖ వైపు నుంచి వచ్చి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను విజయవాడ రాకుండా హనుమాన్జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తారు. నూజివీడు, మైలవరం, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం వైపు పంపిస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఇబ్రహీంపట్నం నుంచి మళ్లించి జి.కొండూరు మీదుగా హనుమాన్ జంక్షన్కు పంపిస్తారు. ఈ మార్గంలో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2వరకు ఆంక్షలు ఉంటాయి. బీ విశాఖ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను విజయవాడ రాకుండా.. హనుమాన్జంక్షన్, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తారు. ఈ మార్గంలోనూ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2వరకు ఆంక్షలు ఉంటాయి. చెన్నై వైపు నుంచి వచ్చి విశాఖ వైపు వెళ్లే వాహనాలను కూడా త్రోవగుంట వద్ద నుంచి మళ్లించి హనుమాన్జంక్షన్కు పంపిస్తారు. ఈ మార్గంలో మాత్రం ఉదయం 6.30 నుంచి ఉదయం 9గంటల వరకూ ఆంక్షలు ఉంటాయి. బీ గుంటూరు నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనాలను కూడా విజయవాడలోనికి అనుమతించరు. బుడంపాడు వద్ద నుంచి పొన్నూరు, రేపల్లె, అవనిగడ్డ మీదుగా హనుమాన్జంక్షన్కు పంపిస్తారు. బీ చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ, మధ్యతరహా వాహనాలను మేదరమెట్ల వద్ద నుంచి అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, నార్కెట్పల్లికి మళ్లిస్తారు. ఈ మార్గంలో ఉదయం 7.30 నుంచి ఉదయం 10.30వరకు మళ్లింపులుంటాయి. బీ మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే వాహనాలను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కంకిపాడు వద్దే ఆపేస్తారు. మచిలీపట్నం నుంచి తాడిగడప వైపు భారీ, మధ్యతరహా రవాణా వాహనాలకు అనుమతి లేదు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో 1500మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు సీపీ కాంతిరాణా టాటా శనివారం తెలిపారు. ఐదుగురు డీసీపీ, నలుగురు ఏడీసీపీ, 12మంది ఏసీపీ, 35మంది సీఐ, 75మంది ఎస్ఐలు విధుల్లో పాల్గొంటారన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు