logo

వ్యర్థాలపై పరదాలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విజయవాడ నగరానికి రానున్నారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా విజయవాడ చేరుకోనున్నారు.

Published : 04 Dec 2022 03:37 IST

- న్యూస్‌టుడే, కేసరపల్లి(గన్నవరం గ్రామీణం)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విజయవాడ నగరానికి రానున్నారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా విజయవాడ చేరుకోనున్నారు. మార్గమధ్యలో దేశ ప్రథమ పౌరురాలికి గన్నవరం మండలం కేసరపల్లి వద్ద హైవే పక్కన ఉండే వ్యర్థాలు కనిపించకుండా ఇలా అడ్డుగా సుమారు రెండు కిలోమీటర్ల పరదాలు కట్టారు. రాష్ట్రపతి రాకకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చేస్తున్న హంగామాకు వాహనదారులు ఆశ్చర్యానికి గురవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని