logo

పాము కాటుతో బాలుడి మృతి

పాము కాటేయడంతో బాలడు మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు బీసీ కాలనీలో చోటుచేసుకుంది.

Published : 05 Dec 2022 05:35 IST

కార్తికేయ మృతదేహం

ఘంటసాల, న్యూస్‌టుడే: పాము కాటేయడంతో బాలడు మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు బీసీ కాలనీలో చోటుచేసుకుంది. యర్రవరపు బసవేశ్వరరావు-సాయి శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు. ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఏడాదిన్నర వయసు గల చిన్న కుమారుడు కార్తికేయను రక్తపింజరు పాము కాటేసింది. బాలుడు పెద్దగా ఏడ్వడంతో తల్లిదండ్రులు మేల్కొని పాము కరచిన విషయాన్ని గుర్తించారు. వెంటనే చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి, అనంతరం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తికేయ మృతిచెందినట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. తల్లి సాయిశిరీషా వ్యవసాయ కూలి పనులు చేస్తుండగా, తండ్రి బసవేశ్వరరావు తాపీ పని చేస్తూ జీవిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కార్తికేయ పాముకాటుకు గురై మృతి చెండంతో తల్లిదండ్రుల రోదనలు చూపరులను కలచి వేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని