కృష్ణా తీరంలో.. ఆత్మీయ ఆతిథ్యం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన విజయవాడలో ప్రశాంతంగా సాగింది. రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన ఆతిథ్యం, పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు.
నగరంలో సజావుగా రాష్ట్రపతి పర్యటన
పోరంకి, విజయవాడలో కార్యక్రమాలు
ప్రత్యేక విమానంలో తిరిగి విశాఖకు పయనం
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి
ఈనాడు, అమరావతి, గన్నవరం, రామవరప్పాడు, పొరంకి, న్యూస్టుడే: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన విజయవాడలో ప్రశాంతంగా సాగింది. రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన ఆతిథ్యం, పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. సుమారు మూడున్నర గంటలకు పైగా రాష్ట్రపతి పర్యటన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సాగింది. ఆదివారం ఉదయం 10.45గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, ఎన్సీసీ ప్రతినిధి సునీల్కుమార్శర్మ, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్బాషా, ఎస్పీ జాషువా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులు విమానాశ్రయానికి తరలివచ్చి రాష్ట్రపతిని స్వాగతించారు. విమానాశ్రయం ఆవరణలో పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో పోరంకిలోని పౌర సన్మాన కార్యక్రమం వద్దకు ద్రౌపది ముర్ము చేరుకున్నారు. పోరంకిలోని వేదిక వద్దకు ఉదయం 11.24గంటలకు రాష్ట్రపతి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.15వరకూ అక్కడే ఉన్నారు. పౌరసన్మాన కార్యక్రమం ముగిసిన వెంటనే విజయవాడలోని రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత మధ్యాహ్నం 2.20కు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. 2.30కు ప్రత్యేక విమానంలో విశాఖకు తరలివెళ్లారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో పాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా వెళ్లారు. గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్, ఇతర ఉన్నతాధికారులు తరలివచ్చి రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వరకూ జాతీయ రహదారి వెంబడి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయంలోనే 800 మంది వరకూ పోలీసులు మోహరించారు.
ఉన్నతాధికారుల వాహనాలు వచ్చే సమయంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోరంకిలో కార్యక్రమం ముగించుకుని రాజ్భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్ కాన్వాయ్లో వరుసగా పోరంకి నుంచి వెళ్లాయి. ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల మీదుగా ఈ మూడు కాన్వాయ్లు వెళ్లిన తర్వాత పోలీసులు ద్విచక్ర వాహనదారులను విడిచి పెట్టారు. అదే సమయంలో పోరంకి నుంచి న్యాయమూర్తులు, కలెక్టర్, విజయవాడ నగర మేయర్ తదితరుల వాహనాలు రావడంతో కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ద్విచక్ర వాహనదారులను ఎక్కడికక్కడ ఆపేసి.. ఉన్నతాధికారులు, న్యాయమూర్తుల కాన్వాయ్ను పంపించారు. పోరంకిలోని పౌరసన్మాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఓ స్వాగత కటౌట్ గాలికి పక్కకు ఒరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దానిని సరిచేశారు. రాష్ట్రపతి రావడానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన జరిగింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి. చిత్రంలో సీఎస్ జవహర్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
అమ్మకు అనుమతి లేదు...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పౌర సన్మానం కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పోరంకి ఎం.కన్వెన్షన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తూ ముఖ్య అతిథులకు పాసులను అందించారు. అయితే ఆ పాస్లో కార్యక్రమం ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే రావాలని, పాసులను వేరొకరికి బదిలీ చేయరాదని ఉందే తప్ప, చంటి పిల్లలను తీసుకురావద్దు, ఒళ్లో కూర్చోపెట్టుకోవడానికి కూడా అనుమతి లేదు, ఒకవేళ తీసుకొస్తే వారికి కూడా పాస్ ఉండాలి అప్పుడు మాత్రమే వేరొక కుర్చీలో కూర్చోపెడతామని ఎక్కడా లేదు. ఈ విషయాలు తెలియక కొంత మంది తల్లులు తమ పిల్లలను తీసుకురాగా, వారిని నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపించేశారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అంటకాగితే.. అంతే రాణా..!
[ 24-04-2024]
అధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
[ 24-04-2024]
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. -
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.